AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోకేశ్వరి ఆత్మహత్య కేసు: వెలుగులోకి కొత్త విషయాలు

పంజాగుట్ట పీఎస్ ఎదుట ఆత్మాహత్యాయత్నం చేసుకొని చికిత్స తీసుకుంటూ మరణించిన లోకేశ్వరి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెల 27న ప్రవీణ్ కుమార్‌పై పంజాగుట్ట పీఎస్‌లో లోకేశ్వరి ఫిర్యాదు చేసింది. దీంతో పంజాగుట్ట ఎస్‌ఐ ప్రవీణ్‌‌తో మాట్లాడారు. ఈ క్రమంలో విచారణ చేసిన తరువాత కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. అయితే దీనితో సంతృప్తి చెందని లోకేశ్వరి.. ఈ విషయంలో ఏసీపీకి ఫిర్యాదు చేసేందుకు మంగళవారం మరోసారి పంజాగుట్టకు వచ్చింది. ఈ క్రమంలో […]

లోకేశ్వరి ఆత్మహత్య కేసు: వెలుగులోకి కొత్త విషయాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 01, 2020 | 9:35 PM

Share

పంజాగుట్ట పీఎస్ ఎదుట ఆత్మాహత్యాయత్నం చేసుకొని చికిత్స తీసుకుంటూ మరణించిన లోకేశ్వరి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెల 27న ప్రవీణ్ కుమార్‌పై పంజాగుట్ట పీఎస్‌లో లోకేశ్వరి ఫిర్యాదు చేసింది. దీంతో పంజాగుట్ట ఎస్‌ఐ ప్రవీణ్‌‌తో మాట్లాడారు. ఈ క్రమంలో విచారణ చేసిన తరువాత కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. అయితే దీనితో సంతృప్తి చెందని లోకేశ్వరి.. ఈ విషయంలో ఏసీపీకి ఫిర్యాదు చేసేందుకు మంగళవారం మరోసారి పంజాగుట్టకు వచ్చింది. ఈ క్రమంలో అరగంట పాటు ప్రవీణ్‌తో లోకేశ్వరి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో నన్ను పోలీసులు ఏం చేయలేరని ప్రవీణ్ రెచ్చగొట్టినట్లు సమాచారం. దీంతో ఆవేశంతో లోకేశ్వరి నిప్పు అంటించుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ప్రారంభించారు.