AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accident: పుట్ పాత్ పై నిద్రిస్తున్న కూలీలపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి

వారంతా వలస కూలీలు. బతుకుదెరువు కోసం పొట్ట చేతబట్టుకుని ఉన్న వారిని వదిలి పెట్టి వచ్చారు. పొద్దంతా కాయా కష్టం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారంతా బృందంగా ఏర్పడి పనులు చేసుకుంటున్నారు. ఉండటానికి....

Accident: పుట్ పాత్ పై నిద్రిస్తున్న కూలీలపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి
Ganesh Mudavath
|

Updated on: May 19, 2022 | 12:17 PM

Share

వారంతా వలస కూలీలు. బతుకుదెరువు కోసం పొట్ట చేతబట్టుకుని ఉన్న వారిని వదిలి పెట్టి వచ్చారు. పొద్దంతా కాయా కష్టం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారంతా బృందంగా ఏర్పడి పనులు చేసుకుంటున్నారు. ఉండటానికి వసతి సౌకర్యం లేకపోవడంతో రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై పడుకున్నారు. రోజూ లాగే బుధవారం పనులు చేసుకుని రాత్రి నిద్రకు ఉపక్రమించారు. ఉదయం లేచి మళ్లీ పనులకు వెళ్లేందుకు అవసరమైన సామగ్రినంతా సర్దుకున్నారు. బాగా అలసిపోవడంతో గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. అదే వారి ఆఖరి రాత్రి అవుతుందని గుర్తించలేకపోయారు. గురువారం తెల్లవారు జామున వారిపై నుంచి ఓ లారీ వేగంగా దూసుకెళ్లింది. అంతే.. వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటన హరియాణాలోని ఝాజ్జర్‌ జిల్లాలో జరిగింది. గురువారం తెల్లవారు జామున కుండలీ-మనేసర్‌- పాల్వాల్‌ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో11 మంది గాయపడ్డారు.

అశోద టోల్‌ ప్లాజా సమీపంలో జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 18 మంది కూలీలు పని చేస్తున్నారు. వారిలో 14 మంది పని అనంతరం విరామం కోసం సమీపంలోని ఫుట్‌పాత్‌పై సేదతీరారు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న ఓ లారీ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లింది. అనంతరం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన అనంతరం డ్రైవర్‌ పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Gyanvapi Masjid Case: రేపటి వరకూ విచారణ ఆపివేయండి.. జ్ఞానవాపి కేసు విచారణకు సుప్రీం కోర్టు బ్రేక్..

Vastu Tips: భార్యాభర్తల మధ్య విబేధాలా.. ఇంట్లో ఈ దిశలో రజినిగంధను పెంచుకోండి..

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే