Sattenapalli Road Accident: మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటోను ఢికొన్న కారు.. ముగ్గురు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

Sattenapalli Road Accident: మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటోను ఢికొన్న కారు.. ముగ్గురు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు
Car Hit Passenger Auto In Sattenapalli
Follow us

|

Updated on: Apr 24, 2021 | 8:09 AM

Car hit passenger auto: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న స్థానికులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నాగరాజు, అలివేలుగా పోలీసులు గుర్తించారు.

Read Also…  బ్లాకులో ప్రాణవాయువు, ఢిల్లీలో ఓ వ్యక్తి ఇంటినుంచి 48 ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం. అరెస్ట్