Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jul 26, 2021 | 4:03 PM

Vikarabad Accident: తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
Road Accident Vikarabad District

Follow us on

Vikarabad Accident: తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. వికారాబాద్ జిల్లాలోని పూడూర్‌ మండలం మన్నెగూడ వద్ద ధరణి కాటన్‌ మిల్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తుండగా.. క్వాలీస్‌ వాహనం ఎక్సల్‌ రాడ్‌ విరిగిపోవడంతో.. ఎదురుగా వస్తున్న కారుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన మల్లికార్జున్‌రెడ్డి (60), రాజ్యలక్ష్మి (56), దేవాన్షురెడ్డి (6) అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు స్థానికుల నుంచి పలు వివరాలు సేకరించారు.

Also Read:

Viral News: పాములు పగబట్టాయా? ఒకే జిల్లాలో విష సర్పాల కాటుకు ఐదుగురు దుర్మరణం.. ఎక్కడంటే?

Andhra Pradesh: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఏపీ స్పీకర్ తమ్మినేని..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu