AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: దారుణం.. గేదెలకు మేత వేయలేదని.. 14ఏళ్ల కొడుకును తుపాకీతో కాల్చి చంపిన తండ్రి!

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. కనికరం లేని ఓ తండ్రి తన 14 ఏళ్ల కన్న కొడుకును అత్యంత పాశవికంగా కాల్చి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

Crime: దారుణం.. గేదెలకు మేత వేయలేదని.. 14ఏళ్ల కొడుకును తుపాకీతో కాల్చి చంపిన తండ్రి!
Buffalo
Balaraju Goud
|

Updated on: Aug 22, 2024 | 3:36 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. కనికరం లేని ఓ తండ్రి తన 14 ఏళ్ల కన్న కొడుకును అత్యంత పాశవికంగా కాల్చి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. 14 ఏళ్ల కుమారుడి మృతి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడు ఆర్మీ మేన్‌గా పనిచేసి, కొంతకాలం క్రితం రిటైర్ అయ్యాడు.

సదర్ ప్రాంతంలోని రాజ్‌పురి చుంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఒక తండ్రి తన కొడుకును కాల్చాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తన కొడుకును గేదెలకు మేపమని చెప్పి బయటకు వెళ్లాడు తండ్రి. అతను తిరిగి వచ్చేసరికి గేదెలకు మేత లేదు. దీంతో ఆగ్రహించిన తండ్రి లైసెన్స్‌డ్ పిస్టల్‌తో కొడుకుపై కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన తర్వాత, తీవ్రంగా గాయపడ్డ కొడుకును ఆసుపత్రికి తరలించాడు. అయితే అతను అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. కుమారుడిని కాల్చిచంపిన అనంతరం నిందితుడు తండ్రి పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుమారుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

కొడుకును కాల్చిచంపిన తర్వాత నిందితుడి తండ్రి పరారీలో ఉండగా, కుమారుడి మృతి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్న విషయానికి తండ్రి తన 14 ఏళ్ల కొడుకును ఎలా హంతకుడు అవుతాడు? ఇంత చిన్న విషయానికి కొడుకు కాల్చి చంపడం ఏంటన్నదీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టిస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఏసీపీ సదరు సుకన్య శర్మ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తండ్రి క్షణికావేశంలో తన కుమారుడిని కాల్చిచంపినట్లు సమాచారం అందిందని ఏసీపీ సుకన్య శర్మ తెలిపారు. గాయపడిన కుమారుడిని ఎస్‌ఎన్‌ మెడికల్‌ కాలేజీకి తరలించగా, అక్కడ చనిపోయినట్లు నిర్ధారించారన్నారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని సుకన్య శర్మ వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్