Crime News: కీచకోపాధ్యాయుడు.. స్పెల్లింగ్స్‌ నేర్పిస్తానంటూ.. విద్యార్థినులను గదిలోకి పిలిపించుకుని..

School director: దేశంలో నిర్భయ లాంటి చట్టాలు అమలవుతున్నప్పటికీ.. కీచకుల బుధ్ది మారడం లేదు. ఉన్నతంగా చదువుకున్న వారు కూడా విద్యార్థినుల పట్ల మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా

Crime News: కీచకోపాధ్యాయుడు.. స్పెల్లింగ్స్‌ నేర్పిస్తానంటూ.. విద్యార్థినులను గదిలోకి పిలిపించుకుని..
Crime News
Follow us

|

Updated on: Oct 05, 2021 | 7:46 AM

School director: దేశంలో నిర్భయ లాంటి చట్టాలు అమలవుతున్నప్పటికీ.. కీచకుల బుధ్ది మారడం లేదు. ఉన్నతంగా చదువుకున్న వారు కూడా విద్యార్థినుల పట్ల మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా చదువుకునేందుకు పాఠశాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్థినులపై ఓ స్కూల్‌ డైరెక్టర్‌ కన్నెశాడు. స్పెల్లింగులు నేర్పిస్తానని చెప్పి అతని గదికి పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణ సంఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌కోట్‌ లోధిక తాలుకాలోని ఓ ప్రైవేటు పాఠశాలకు డైరెక్టర్‌గా దినేశ్ జోషి పని చేస్తున్నాడు. కరోనా అనంతరం పాఠశాలలు ప్రారంభం కావడంతో… దినేశ్‌ జోషి కొన్ని రోజుల క్రితం స్పెల్లింగులు నేర్పిస్తానంటూ ఇద్దరు బాలికలను తన రూమ్‌కి రమ్మని పిలిచాడు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థులు గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికే.. వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు.

అక్కడి నుంచి వచ్చిన అనంతరం ఓ బాలిక ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. మరో అమ్మాయి తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలిసింది. వీరిద్దరే గాక అతని ప్రవర్తన అందరితో ఇలానే ఉండేదని పోలీసులు తెలిపారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఇతర బాధిత విద్యార్థులు అంతకుముందు తమపై జరిగిన దారుణాల గురించి చెప్పారు. దీంతో దాదాపు వందమంది తల్లిదండ్రులు, విద్యార్థినులు లోధిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జోషిపై ఫిర్యాదు చేశారు. నిందితుడు జోషి భార్య సీమా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే.. ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకుని.. బాధిత బాలికల తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో జోషిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితుడిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని బాధిత బాలికల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Also Read:

Hyderabad Drunk and Drive: ఉక్కుపాదం మోపుతున్నా మార్పు రావడం లేదు.. తాగుబోతుల వీరంగానికి యువతి బలి..

Crime News: సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మృత్యు ఒడికి.. కాల్వలో ముగ్గురు యువకుల గల్లంతు..

Latest Articles
వృద్ధాప్యంలో మీకు నిశ్చింత.. రోజుకు రూ. 50తో రూ. 31లక్షల సంపాదన..
వృద్ధాప్యంలో మీకు నిశ్చింత.. రోజుకు రూ. 50తో రూ. 31లక్షల సంపాదన..
'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'..తల్లికి రైతు బిడ్డ గిఫ్ట్
'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'..తల్లికి రైతు బిడ్డ గిఫ్ట్
పన్ను చెల్లించే ఉద్యోగులకు అలెర్ట్.. ఆ ఫామ్ లేకపోతే పన్ను బాదుడు
పన్ను చెల్లించే ఉద్యోగులకు అలెర్ట్.. ఆ ఫామ్ లేకపోతే పన్ను బాదుడు
వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో మరో కాంగ్రెస్ నేత..!
వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో మరో కాంగ్రెస్ నేత..!
అర్ధరాత్రి చుక్కేసి పోలీస్‌ కాలర్‌ పట్టుకుని రచ్చచేసిన యువతులు..!
అర్ధరాత్రి చుక్కేసి పోలీస్‌ కాలర్‌ పట్టుకుని రచ్చచేసిన యువతులు..!
దుమ్ములేపిన శామ్సంగ్, యాపిల్.. ఎన్ని ఫోన్లు అమ్ముడయ్యాయో తెలుసా?
దుమ్ములేపిన శామ్సంగ్, యాపిల్.. ఎన్ని ఫోన్లు అమ్ముడయ్యాయో తెలుసా?
మంచి మనసు చాటుకున్న స్టైలీష్ స్టార్..
మంచి మనసు చాటుకున్న స్టైలీష్ స్టార్..
భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 8 ఏ లాంచ్.. రూ.20 వేల తగ్గింపు
భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 8 ఏ లాంచ్.. రూ.20 వేల తగ్గింపు
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఆరేళ్ల బిడ్డను మొసళ్ళకు ఆహారంగా వేసిన తల్లి..!
ఆరేళ్ల బిడ్డను మొసళ్ళకు ఆహారంగా వేసిన తల్లి..!