హైదరాబాద్‌లో పాఠశాల బస్సు బీభత్సం.. పలు వాహనాలు ధ్వంసం.. నలుగురికి తీవ్రగాయాలు

హైదరాబాద్ మహానగరంలో టోలిచౌకి బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్‌లో పాఠశాల బస్సు బీభత్సం.. పలు వాహనాలు ధ్వంసం.. నలుగురికి తీవ్రగాయాలు
Follow us

|

Updated on: Feb 17, 2021 | 9:32 PM

School bus accident : హైదరాబాద్ మహానగరంలో టోలిచౌకి బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. అతి వేగంగా వచ్చిన ఓ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు టోలిచౌకి ప్రాంతంలో వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడు వాహనాలను ఢీకొనడంతో, అందులో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే, బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ సంఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also…  వివాదాస్పద తీర్పులిచ్చిన బాంబే హైకోర్టు జడ్జికి షాక్.. జడ్జిమెంట్‌ను తప్పుబడుతూ ఆ ప్యాకెట్లను పంపిన మహిళ..!