AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

East Godavari : పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి, మహిళా కార్యదర్శిని దిక్కున్నచోట చెప్పుకోమన్న సర్పంచ్ భర్త

తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం ములికిపల్లిలో సంచలనం చోటు చేసుకుంది. మహిళా సర్పంచ్ భర్త పంచాయితీకి తాళం వేసి వెళ్ళిపోయిన ఘటన..

East Godavari : పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి, మహిళా కార్యదర్శిని దిక్కున్నచోట చెప్పుకోమన్న సర్పంచ్ భర్త
Mulikipalli Panchayat Offic
Venkata Narayana
|

Updated on: Jun 21, 2021 | 10:58 AM

Share

Sarpanch’s husband locked Mulikipalli Panchayat Office : తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం ములికిపల్లిలో సంచలనం చోటు చేసుకుంది. మహిళా సర్పంచ్ భర్త పంచాయితీకి తాళం వేసి వెళ్ళిపోయిన ఘటన నెలకొంది. నిన్న(ఆదివారం) వ్యాక్సిన్ కూపన్లు వితరణ విషయంలో ములికిపల్లి గ్రామ సర్పంచ్ భర్త రాజు చెలరేగి పోయినట్టు తెలుస్తోంది. సర్పంచ్ భర్త గుబ్బల రాజు మహిళా కార్యదర్శిని బయటకు పంపి, పంచాయతీకి తాళం వేసి నీకు దిక్కున్న చోట చెప్పుకోమని దుర్భాషలాడినట్టు తెలుస్తోంది.

వివాదానికి అసలు కారణం ఏంటంటే.. కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ములికిల్లి పంచాయతీ నుండి వ్యాక్సినేషన్ కూపన్లను ప్రజలకు పంపిణీ చేసేందుకు పంచాయతీ కార్యదర్శి రజని సిద్ధంచేసుకున్నారు. అయితే, కూపన్ల పంపిణీ పంచాయతీ దగ్గర కాదు.. మా ఇంటి దగ్గర నుండి కూపన్లు పంపిణీ చేయాలంటూ సర్పంచ్ భర్త రాజు హుకుం జారీ చేశారు.

కానీ, సర్పంచ్ ఇంటి వద్ద నుండి కూపన్లు పంపిణీ కుదరదని కార్యదర్శి రజిని తేల్చి చెప్పడంతో సర్పంచ్ భర్తకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కార్యదర్శి రజనిపై నానా దుర్భాషలాడి పంచాయతీకి తాళం వేశాడు సర్పంచ్ భర్త రాజు.

Read also :  PM Modi Yoga : కరోనా నుంచి పోరాడేందుకు యోగాను సురక్షా కవచంగా మార్చుకోండి : M-Yoga app రిలీజ్ చేసిన ప్రధాని