AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు సమీపంలోని ఓ గోదాములో అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బొంతపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న ఈ గోదాములో మొదట మంటలు చెలరేగగా.. అందులో ఉన్న రసాయన డ్రమ్ములు పేలి క్షణాల్లో..

సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 23, 2020 | 10:41 AM

Share

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు సమీపంలోని ఓ గోదాములో అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బొంతపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న ఈ గోదాములో మొదట మంటలు చెలరేగగా.. అందులో ఉన్న రసాయన డ్రమ్ములు పేలి క్షణాల్లో మంటలు విస్తరించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 10 మంది ఫైర్ సిబ్బంది సుమారు నాలుగు గంటల పాటు శ్రమ పడి ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రమాద సమయంలో గోదాములో ఉన్న నలుగురు సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం కారణంగా దట్టమైన పొగలు మూడు కిలో మీటర్ల మేర కమ్మేయగా స్థానికులు తీవ్ర భయందోళన వ్యక్తం చేశారు. ఇక పరిశ్రమ యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More:

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న డైరెక్టర్ శివ నిర్వాణ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి.. ఈ రోజు ఎన్ని కేసులంటే?