AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Psycho Attack: నిజామాబాద్ జిల్లాలో సైకో వీరంగం.. ముగ్గురు వ్యక్తులపై కత్తితో దాడి.. ఒకరి పరిస్థితి విషమం

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. అడ్డొచ్చిన వారిపై కత్తితో దాడి చేశాడు.

Psycho Attack: నిజామాబాద్ జిల్లాలో సైకో వీరంగం.. ముగ్గురు వ్యక్తులపై కత్తితో దాడి.. ఒకరి పరిస్థితి విషమం
Psycho Attack In Nizamabad Distrct
Balaraju Goud
|

Updated on: Jun 23, 2021 | 6:45 AM

Share

Psycho Attack in Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. అడ్డొచ్చిన వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నాలేశ్వర్ గ్రామానికి చెందిన మైనర్ బాలికకు అదే ప్రాంతానికి చెందిన సాయిరాం అనే యువకుడు కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. అతని వేధింపులు భరించలేని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో రెండు కుటుంబాలకు చెందినవారు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఈ తప్పును మళ్లి చేయకూడదని గ్రామ పెద్దలు సాయిరాంను మందలించి పంపించి వేశారు.

దీన్ని తీవ్రంగా పరిగణించిన సాయిరాం.. పంచాయితీ పెట్టారన్న కోపంతో బాలిక కుటుంబసభ్యులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక తండ్రి పోశెట్టి, చిన్నాన్న నడిపి పోశెట్ట, బాలిక సోదరుడు శ్రీకాంత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ముగ్గురిని స్థానికులు హుటాహుటీన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, నడిపి పోశెట్టి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి స్థానికులు నవీపేట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also….  Drunk Cop: తప్పతాగి.. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్ఐ.. ఆ తర్వాత ఏమైందంటే..?