ఘట్‌కేసర్ ఘటనలో కొత్త ట్విస్ట్.. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా లోకేషన్ ట్రేస్.. పోలీసుల రాకతో నిందితుల జంప్

కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బీఫార్మసీ విద్యార్థినిని ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి అఘాయిత్యాని యత్నించారు.

ఘట్‌కేసర్ ఘటనలో కొత్త ట్విస్ట్..  సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా లోకేషన్ ట్రేస్.. పోలీసుల రాకతో నిందితుల జంప్
Follow us

|

Updated on: Feb 11, 2021 | 8:36 AM

Pharmacy student kidnap : హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది.. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బీఫార్మసీ విద్యార్థినిని ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి అఘాయిత్యాని యత్నించారు. ఎదురించిన అమ్మాయిని గాయపర్చారు. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం రాంపల్లికి చెందిన చెందిన అమ్మాయి కండ్లకోయలోని ఓ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతోంది. ఎప్పటిలాగానే కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో నాగారంలో బస్సు దిగి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌ నగర్‌ బస్టాప్‌ వెళ్లేందుకు సెవన్‌ సీటర్‌ ఆటో ఎక్కింది. ఆమెతో పాటు తన సీనియర్, ఇద్దరు ప్యాసింజర్లు కూడా ఆటోలో ఉన్నారు. అయితే, కొద్ది దూరం వెళ్లాక ఆ ముగ్గురూ దిగిపోయారు.

ఆటోలో ఒంటరిగా ఉన్న అమ్మాయి చూసిన ఆటో డ్రైవర్ అలోచనలు పక్కదారి పట్టాయి. ఇదే అదనుగా భావించి ఆమె దిగాల్సిన చోట ఆపకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. అప్పటికే యామన్నపేట దగ్గర వేచి ఉన్న మరో వ్యాన్‌లోకి ఆటోలో నుంచి ఆమెను బలవంతంగా ఎక్కించారు. అక్కడి నుంచి ఘట్‌కేసర్‌ రైల్వే ట్రాక్‌ వద్దకు తీసుకెళ్లి.. ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించారు. అయితే, అటుగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం సైరన్‌ విన్పించడంతో అక్కడి నుంచి మకాం మార్చారు. ఘట్‌కేసర్‌ ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ చేంజ్‌ సర్వీసు రోడ్డుకు సమీపంలోని ఓ భవనం వద్దకు ఆమెను తీసుకెళ్లారు. అప్పటికీ పోలీసులు తమను వెంటాడుతున్నారని భావించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఇదిలావుంటే, దిగాల్సిన చోట ఆపకుండా ఆటోను తీసుకెళ్తున్న సమయంలోనే బాధితురాలు తన తల్లికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. వెంటనే అలెర్ట్‌ అయిన బాధితురాలి తల్లి తమ సమీప బంధువైన ఓ అబ్బాయికి ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పింది. దీంతో అతను డయల్‌ 100కు కాల్‌చేసి ఫిర్యాదు చేశాడు. అప్పటికప్పుడు కీసర, ఘట్‌కేసర్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి జల్లెడ పట్టారు. బాధితురాలి ఫోన్‌ నంబర్‌ లోకేషన్‌ను ఆధారంగా ట్రేస్‌ చేయడంతో చివరికి ఘట్‌కేసర్‌ సర్వీసు రోడ్డుకు సమీపంలో నిర్మాణం ఆగిపోయిన ఓ భవనం వద్ద చూపింది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకోవడంతో నిందితులు తప్పించుకున్నారు.

ఆటో డ్రైవర్‌తో జరిగిన పెనుగులాటలో బాధితురాలి కుడికాలికి గాయమైంది. ఎట్టకేలకు రాత్రి 7:50 గంటల ప్రాంతంలో బాధితురాలి వద్దకు చేరుకున్న పోలీసులు వారి వాహనంలోనే జోడిమెట్లలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, కుడికాలికి మాత్రం గాయమైందని వైద్యులు తెలిపారు.

విషయం తెలుసుకున్న మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ శ్యాం ప్రసాద్‌కుమార్‌ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆటోడ్రైవర్‌ను గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకున్నామని డీసీపీ రక్షితామూర్తి తెలిపారు.

Read Also…  పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న వాహనాలను ఢీకొన్న డీసీఎం.. ఇద్దరు మృతి

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ