AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తనతో ఉండాలంటూ ప్రైవేట్‌ ఫొటోతో కూతురి ఫ్రెండ్‌ను వేధించాడు..! చివరికి..

బెంగళూరు శివార్లలోని నెలమంగళలో ఒక నర్సు ఆత్మహత్య చేసుకుంది. క్లాస్‌మేట్ తండ్రి ప్రైవేట్ ఫోటోతో బ్లాక్‌మెయిల్ చేసి వేధించడంతో ఆమె ఈ చర్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. మైసూరులో నర్సింగ్ చదువుకున్న భావన అనే యువతి పోలీసుల హెచ్చరిక తర్వాత కూడా నిందితుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు.

తనతో ఉండాలంటూ ప్రైవేట్‌ ఫొటోతో కూతురి ఫ్రెండ్‌ను వేధించాడు..! చివరికి..
Representative Image
SN Pasha
|

Updated on: Jul 31, 2025 | 3:02 PM

Share

బెంగళూరు శివార్లలోని నెలమంగళ పోలీస్ స్టేషన్ పరిధిలో తన స్నేహితురాలి తండ్రి చేసిన బెదిరింపులకు గురై ఒక నర్సు ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలిని తుమకూరు జిల్లా గుబ్బి పట్టణంలోని గ్యారహళ్లి నివాసి అయిన 22 ఏళ్ల భావనగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె క్లాస్‌మేట్ తండ్రి, నవీన్ అని గుర్తించబడిన వ్యక్తి, ఒక ప్రైవేట్ ఫోటోగ్రాఫ్ తో ఆమెను బ్లాక్ మెయిల్ చేసి వేధించాడు. భావన మైసూరులో నర్సింగ్ చదువుతున్నప్పుడు, ఆమె తండ్రి నవీన్ కుమార్తె బ్యాంకు ఖాతాకు ఆమె మొబైల్ ద్వారా డబ్బు పంపేవాడు. నిందితుడు తన కుమార్తె ఫోన్ నుండి భావన నంబర్‌ను యాక్సెస్ చేసి ఆమెను సంప్రదించడం ప్రారంభించాడు.

చదువు పూర్తయిన తర్వాత భావన తుమకూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేయడం ప్రారంభించింది. నిందితుడు ఆమెతో సంబంధాలు కొనసాగించాడు, ఒకసారి ఆమెను ధర్మస్థలానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో అతను ఓ ఫోటో దిగి.. దాన్ని చూపిస్తూ తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించడం, ఒత్తిడి చేయడం ప్రారంభించాడని తెలుస్తోంది. ఆమె తనతో మాత్రమే సహవాసం చేయాలని, మరెవరినీ వివాహం చేసుకోకూడదని బ్లాక్‌ మెయిల్‌ చేసేవాడు. ఆమె మాట వినకపోతే ప్రైవేట్ ఫోటోను వైరల్ చేస్తానని నిందితుడు బెదిరించాడని పోలీసులు తెలిపారు.

ఆ వేధింపులు భరించలేక భావన 15 రోజుల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటన తర్వాత ఆమె తండ్రి నిందితుడిపై చేలూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆమె కోలుకుంది. పోలీసులు నిందితుడికి హెచ్చరిక జారీ చేసి బాధితురాలికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ, ఫలితం లేకపోయింది. గురువారం భావన నేలమంగళలోని తన అత్త ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత శుక్రవారం తన అత్తతో ఉండటానికి ఆమె అక్కడికి వెళ్లింది. ఘటన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు నేలమంగళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి