AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: దారుణం.. ఫోన్ ఎత్తడం లేదని మహిళ గొంతుకోసిన యువకుడు.. పరిస్థితి విషమం!

ఇద్దరు యువకులు బ్లేడుతో గొంతుకోసారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను హుటా హుటినా స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయాలైన మహిళను

Andhra Pradesh: దారుణం.. ఫోన్ ఎత్తడం లేదని మహిళ గొంతుకోసిన యువకుడు.. పరిస్థితి విషమం!
Crime
Jyothi Gadda
|

Updated on: Jul 20, 2022 | 9:54 PM

Share

Nellore: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని రేబాల గ్రామంలో కామాక్షి అనే మహిళను ఇద్దరు యువకులు బ్లేడుతో గొంతుకోసారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను హుటా హుటినా స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. యువకులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఏంజరిగింది? బ్లేడుతో మహిళను గొంతు కోయడానికి కారణమేంటి? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలోని స్థానిక ఇందిరమ్మ కాలనీలో నివాసముండే కామాక్షమ్మ ఒంటరిగా ఉంటోంది. ఆమె భర్త మరణించాడు. ఇదిలా ఉండగా బుధవారం ఆమె తన ఇంట్లో వంట చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా సాలు చింతల గ్రామానికి చెందిన వెంకట్‌ అనే యువకుడు ఇంట్లోకి చొరబడ్డాడు. తన ఫోన్‌ ఎందుకు ఎత్తడం లేదంటూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు.. నోటికి వచ్చిన బూతులు తిడుతూ ఆమెపై దాడి చేశాడు. ఈ క్రమంలోనే బ్లేడుతో మహిళ గొంతు కోశాడు.. శరీరంపై గాయాలు చేశాడు. ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో అతను ఇంటి బయట ఉన్న మరో యువకుడితో కలిసి పారిపోయే ప్రయత్నం చేశాడు. స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయాలైన మహిళను బుచ్చిరెడ్డిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చించారు. అయితే, గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని యువకులు ఫోన్లో తనను వేధిస్తున్నారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి