AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం.. మర్రిమిట్ట మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి, ఎంపీ

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఆరుగురు మృతుల కుటుంబ సభ్యులను..

ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం.. మర్రిమిట్ట మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి, ఎంపీ
K Sammaiah
|

Updated on: Jan 31, 2021 | 5:05 AM

Share

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఆరుగురు మృతుల కుటుంబ సభ్యులను మహబూబాబాద్ జిల్లా ప్రధాన వైద్యశాలలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవితలు పరామర్శించారు.

ఈ దుర్ఘటన అత్యంత దురదృష్టకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ తాగి ఉండడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల పెళ్లి కావలసిన ఇంటిలో విషాదఛాయలు అలుముకున్నాయన్నారు. చనిపోయిన వారిలో డ్రైవర్ రమేష్ కు ఆర్. ఓ. ఎఫ్. ఆర్ పట్టా ఉంది, కానీ కార్డు లేదని, అయినప్పటికీ తమ శాఖ తరపున రాము కుటుంబానికి 5 లక్షల రూపాయల రైతు బీమా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.

మృతదేహాల అంత్యక్రియలకు మంత్రి సత్యవతి రాథోడ్‌ ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆరుగురికి రూ.60 వేలు, ఎంపీ కవిత ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున ఆరుగురికి 30 వేల రూపాయలు వారి వ్యక్తిగతంగా అందజేశారు. వెంటనే అంబులెన్స్ లు ఏర్పాటు చేసి, మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

మంత్రితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి, హాస్పిటల్ సూపరింటెందెంట్ భీమ్ సాగర్, గూడూరు జెడ్పీటీసీ సుచిత్ర, టి.ఆర్.ఎస్ నేతలు భరత్ కుమార్ రెడ్డి, పరకాల శ్రీనివాస రెడ్డి, ఇతర అధికారులు, నేతలు ఉన్నారు.

ఇంట్లో దైవ శక్తి పెరగాలంటే ఈ 4 పనులు తప్పనిసరి!
ఇంట్లో దైవ శక్తి పెరగాలంటే ఈ 4 పనులు తప్పనిసరి!
దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!
దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!
ఈ టీతో బీపీ, వెయిట్ లాస్, కీళ్ల నొప్పులు అన్నింటికీ చెక్ పెట్టండి
ఈ టీతో బీపీ, వెయిట్ లాస్, కీళ్ల నొప్పులు అన్నింటికీ చెక్ పెట్టండి
మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
పారిశుద్ధ్య కార్మికురాలికి గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీ.. ఎందుకంటే?
పారిశుద్ధ్య కార్మికురాలికి గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీ.. ఎందుకంటే?
భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్
భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్
పుణ్య దంపతులు..మరణంలోనూ ఒకరికి ఒకరు తోడుగా!
పుణ్య దంపతులు..మరణంలోనూ ఒకరికి ఒకరు తోడుగా!
గోల్డ్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఏప్రిల్ 1 నుంచి..
గోల్డ్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఏప్రిల్ 1 నుంచి..
రొమ్ము క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలిస్తే షాకవుతారు
రొమ్ము క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలిస్తే షాకవుతారు
2 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే.. భారీ వంతెన
2 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే.. భారీ వంతెన