5

Mancherial: మంచిర్యాల జిల్లాలో దారుణం.. ఎమ్మార్వో కార్యాలయంలోనే వీఆర్‌ఏ దారుణ హత్య..

మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నెపల్లి తహశీల్దార్‌ కార్యాలయంలో ఓ వీఆర్ఏ దారుణ హత్యకు గురవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

Mancherial: మంచిర్యాల జిల్లాలో దారుణం.. ఎమ్మార్వో కార్యాలయంలోనే వీఆర్‌ఏ దారుణ హత్య..
Follow us

|

Updated on: Mar 14, 2022 | 11:57 AM

మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నెపల్లి తహశీల్దార్‌ కార్యాలయంలో ఓ వీఆర్ఏ దారుణ హత్యకు గురవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడు దుర్గంబాబు(50) కొత్తపల్లి వీఆర్‌ఏగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల (Mancherial) జిల్లాలోని కన్నెపల్లి తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న దుర్గం బాబును గుర్తు తెలియని దుండగులు కత్తితో గొంతు కోసి చంపారు. రక్తం మడుగులో పడి ఉన్న బాబును చూసి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా దుర్గంబాబును చంపేస్తాడని బెదరిస్తున్నారని, దీనిపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశామని హతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతనే బాబును హత్య చేసి ఉంటాడని వారు ఆరోపిస్తున్నారు. కాగా వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్య జరిగిందా? లేదంటే రెవెన్యూ అధికారుల గొడవలతో జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ ప్రారంభించారు.

Also Read: Jangareddygudem: వరుస మరణాలపై హీటెక్కుతున్న ఏపీ రాజకీయాలు.. టీడీపీ ఆందోళనతో అసెంబ్లీ వాయిదా

CWC: సీడబ్యూసీ సమావేశంలో ఏం జరిగింది..? ఆసక్తికర విషయాలను వెల్లడించిన సీనియర్ నేత..

Fingernails Bite: గోర్లు కొరుకుతున్నారా ? అయితే మీకు ఈ వ్యాధులు ఉన్నట్టే.. అవేంటంటే..

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న పరిశుభ్రతపై భారీ కార్యక్రమం
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న పరిశుభ్రతపై భారీ కార్యక్రమం
వాగు ఒడ్డున ప్రసవం.. వైద్యులుగా మారిన 108 సిబ్బంది.
వాగు ఒడ్డున ప్రసవం.. వైద్యులుగా మారిన 108 సిబ్బంది.
మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. గణేష్‌ మండపంలో లడ్డును..
మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. గణేష్‌ మండపంలో లడ్డును..
మండపంలో లడ్డు ప్రసాదం కోసం హై సెక్యూరిటీ..ఖర్చు తెలిస్తే షాక్..
మండపంలో లడ్డు ప్రసాదం కోసం హై సెక్యూరిటీ..ఖర్చు తెలిస్తే షాక్..
ఇవాళ్టితో ముగియనున్న చంద్రబాబు కస్టడీ, రిమాండ్‌.. నెక్స్ట్ ఏంటీ..
ఇవాళ్టితో ముగియనున్న చంద్రబాబు కస్టడీ, రిమాండ్‌.. నెక్స్ట్ ఏంటీ..
ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ, సమంతల ఖుషి..
ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ, సమంతల ఖుషి..
స్మార్ట్ ఫోన్ ముందు దగ్గితే చాలు.. ఆ వ్యాధి తీవ్రత తెలిసిపోతుంది
స్మార్ట్ ఫోన్ ముందు దగ్గితే చాలు.. ఆ వ్యాధి తీవ్రత తెలిసిపోతుంది
ఈ 5 రకాల కిరాణా వస్తువులను పెద్ద మొత్తంలో అస్సలు కొనకూడదు
ఈ 5 రకాల కిరాణా వస్తువులను పెద్ద మొత్తంలో అస్సలు కొనకూడదు
బైక్‌ రైడింగ్‌లో కుర్రాళ్లకే సవాలు విసురుతున్న బామ్మ..
బైక్‌ రైడింగ్‌లో కుర్రాళ్లకే సవాలు విసురుతున్న బామ్మ..
వారణాసిలో ప్రధాని మోడీకి టీమ్ ఇండియా జెర్సీ బహుమతి..
వారణాసిలో ప్రధాని మోడీకి టీమ్ ఇండియా జెర్సీ బహుమతి..