మేక మేత కొట్లాట.. ఏకంగా మనిషి ప్రాణాలను తీసింది..

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఖండ్వా జిల్లాలోని హప్లా గ్రామంలో సోమవారం రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

మేక మేత కొట్లాట.. ఏకంగా మనిషి ప్రాణాలను తీసింది..
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2020 | 10:26 PM

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఖండ్వా జిల్లాలోని హప్లా గ్రామంలో సోమవారం రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మేక మేసిన మేతకు సంబంధించి చిన్న గొడవ చోటుచేసుకుందని.. అయితే అది కాస్త పెద్ద ఘర్షణకు దారితీసిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 19 మందిని అరెస్ట్ చేశామని.. త్వరలో మరికొందర్ని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు. నిందితులపై ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 307,302,147,148,149 కింద కేసులు నమోదు చేసినట్లు ఖండ్వా జిల్లా ఎస్పీ తెలిపారు. అంతేకాదు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కూడా కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.