Robbery: యూట్యూబ్‌ను తెగ వాడేశాడు.. పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టాడు.. చివరకు

జూన్‌ 5న అచ్చోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో సుమారు రూ.10 లక్షల విలువైన నగలు, డబ్బును ఓ వ్యక్తి దొంగిలించాడు.

Robbery: యూట్యూబ్‌ను తెగ వాడేశాడు.. పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టాడు.. చివరకు
Robbery
Follow us

|

Updated on: Jun 15, 2022 | 4:34 PM

Palghar Robbery: దొంగలు రోజుకు రోజుకు పెచ్చుమీరుతున్నారు. యూట్యూబ్ చూసి మరి దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన ఓ దొంగతనం పోలీసులనే ఆశ్చర్యంలో ముంచెత్తింది. యూట్యూట్ చూసి దొంగతనానికి పాల్పడిన దొంగను మహారాష్ట్ర పోలీసులు.. యూపీలో అరెస్టు చేశారు. ఈ ఘటన మహరాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్‌ 5న అచ్చోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో సుమారు రూ.10 లక్షల విలువైన నగలు, డబ్బును ఓ వ్యక్తి దొంగిలించాడు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివరాలు సేకరించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం నిందితుడు ఇతర రాష్ట్రాలకు పారిపోయి ఉంటాడని అనుమానించారు. ఈ క్రమంలోనే గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కు పోలీసు బృందాలను పంపినట్లు అసిస్టెంట్ కమిషనర్ పంకజ్ శిర్సత్ తెలిపారు. ఇలా వెతుకుతున్న క్రమంలో నిందితుడు దిల్షాద్‌ ఫయాజ్‌ షేక్‌ యూపీలో పోలీసుల కంట పడ్డాడని తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా పలు షాకింగ్ విషయాలు తెలిపినట్లు పంకజ్ వివరించారు.

అంతకుముందు నేర చరిత్ర లేని వ్యక్తి.. యూట్యూబ్‌లో ఎలా దొంగతనం చేయాలో చూసి ఆ ప్రకారమే చోరీ చేశానని.. చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దిల్షాద్‌ ఫయాజ్‌ షేక్‌ నుంచి రూ.9.75 లక్షల విలువైన నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కావ్యా పాపతో ఉన్న ఈ క్యూటీ ఆ స్టార్ క్రికెటర్ చెల్లినా?
కావ్యా పాపతో ఉన్న ఈ క్యూటీ ఆ స్టార్ క్రికెటర్ చెల్లినా?
లోక్‌సభ ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి ఆరుగురు మహిళలు
లోక్‌సభ ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి ఆరుగురు మహిళలు
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?