ఇంత దారుణమా.. తాళ్లతో కట్టేసి కాల్చి చంపేశారు..

ఉత్తర్‌ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ప్రతాప్‌ఘర్‌ జిల్లాలో ఓ యువకుడిని స్థానికులు తాళ్లతో కట్టేసి పెట్రోల్ పోసి కాల్చేశారు.

ఇంత దారుణమా.. తాళ్లతో కట్టేసి కాల్చి చంపేశారు..
burn
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2020 | 8:55 PM

ఉత్తర్‌ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ప్రతాప్‌ఘర్‌ జిల్లాలో ఓ యువకుడిని స్థానికులు తాళ్లతో కట్టేసి పెట్రోల్ పోసి కాల్చేశారు. కహ్లా గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే అంబికా ప్రసాద్ అనే యువకుడికి ఓ మహిళతో రిలేషన్‌ షిప్‌ ఉందని.. ఈ క్రమంలోనే ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిపారు. సదరు మహిళతో పాటు.. యువకుడికి సంబంధించిన ఇరు కుటుంబాల మధ్య.. ఈ రిలేషన్‌షిప్‌ నేపథ్యంలో గొడవలు ఉన్నాయని కూడా తెలిపారు. అయితే సోమవారం నాడు.. సదరు యువకుడిని చెట్టుకు తాళ్లతో కట్టేసి.. కాల్చి చంపేశారని.. ఈ విషయాన్ని సోమవారం రాత్రి 8 గంటలకు తమకు తెలిసిందని పోలీస్ అధికారి పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. ఇద్దరు నిందితుల్ని కూడా అరెస్ట్ చేశామని.. వీరిపై సెక్షన్‌ 302 (మర్డర్‌), ఐపీసీ సెక్షన్‌ 201 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.