justice for lovi assumi: మృగాళ్ల పైశాచికత్వం.. అమ్మాయి దుస్తులు చింపేసి, ఘోరం.. వీడియో వైరల్..

Facts Justice Lovi Assumi Molestation Video: ఓ యువతి ఆత్మహత్య ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని కుదిపేస్తోంది. ఇరవై ఐదేళ్ల లోవీ అస్సుమీ ఆత్మహత్యకు దారితీసిన ఉదంతంపై అందరూ గళమెత్తుతున్నారు. నాగాలాండ్​కు చెందిన లోవి.. జోధ్​పూర్​లోని ఓ రెస్టారెంట్​లో

justice for lovi assumi: మృగాళ్ల పైశాచికత్వం.. అమ్మాయి దుస్తులు చింపేసి, ఘోరం.. వీడియో వైరల్..
Woman Suicide
Follow us

|

Updated on: May 27, 2021 | 12:55 PM

Facts Justice Lovi Assumi Molestation Video: ఓ యువతి ఆత్మహత్య ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని కుదిపేస్తోంది. ఇరవై ఐదేళ్ల లోవీ అస్సుమీ ఆత్మహత్యకు దారితీసిన ఉదంతంపై అందరూ గళమెత్తుతున్నారు. నాగాలాండ్​కు చెందిన లోవి.. జోధ్​పూర్​లోని ఓ రెస్టారెంట్​లో పని చేస్తోంది. ఈ క్రమంలో మే 23న తానుంటున్న గదిలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్​లో ఓ వీడియో రిలీజ్​ అయ్యింది. నలుగురు వ్యక్తులు, ఓ మహిళ కలిసి ఓ అమ్మాయిని దుస్తులు చించేసి శారీరకంగా హింసించిన వీడియోను ఇంటర్నెట్​లో ఉంచారు. కొందరు లోవీ అస్సుమీ ఉరికి వేలాడుతున్న ఫొటోలను, వేధింపుల వీడియోను, అందులోని స్క్రీన్​ షాట్స్​ను సోషల్ మీడియాలో షేర్​ చేశారు. ఆ వీడియోలో ఉంది లోవి అస్సుమీ అని, ఆ అవమాన భారం తట్టుకోలేకే ఆమె సూసైడ్ చేసుకుందన్న ప్రచారం ముమ్మరంగా ప్రారంభమైంది. దీంతో ఆమెకు న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు ఉద్యమిస్తున్నారు. దీనికోసం ఏర్పాటైన #justiceforloviassumi అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా ట్విట్టర్ ను కుదిపేస్తున్నారు.

వేర్వేరే ఘటనలు అయితే నాగాలాండ్​ యువతి సూసైడ్​కి, ఆ వీడియోకు సంబంధం లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ అడిషినల్ డీజీపీ రాబిన్​ హిబు కార్యాలయం నుంచి ఒక స్టేట్​మెంట్ సైతం రిలీజ్​ అయ్యింది. అవి రెండు వేర్వేరు ఘటనలని, ఈమేరకు రాజస్థాన్ డీజీపీతో సంప్రదించి ధృవీకరించినట్లు చెప్పారు. అంతేకాదు వీడియోలను నాగాలాండ్​ యువతి సూసైడ్​కి ముడిపెట్టి వైరల్ చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసును వేగంగా దర్యాప్తు జరపాలని గుజరాత్​, మిజోరాం, రాజస్థాన్​ పోలీసులకు సైతం సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ సమాచారంతో కొందరు యూట్యూబర్లు ఈ వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఘటనలో ఉన్న బాధితురాలు ఎవరైనా సరే.. నిందితులను శిక్షించాల్సిందేనని కొందరు డిమాండ్​ చేస్తున్నారు. ఈ మేరకు అస్సాం పోలీసులు ఫేస్​బుక్​లో ఒక ప్రకటనను సైతం పోస్ట్​ చేశారు. వీడియోలో ఐదుగురు ఉన్నారని, వాళ్ల ఆచూకీ చెబితే నజరానా అందిస్తామని వెల్లడించారు. ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలిదు. కానీ, నిందితుల సమాచారం అందిస్తే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామంటూ అస్సాం పోలీసులు వెల్లడించారు.

Also Read:

Mandya: హృదయ విదారక ఘటన.. కోవిడ్ రిపోర్టు లేదని గర్భిణికి వైద్యం నిరాకరణ.. ఆ తర్వాత ఏమైందంటే?

Vijayawada: బెజవాడ ‘కిలాడీ లేడీ’ అరెస్ట్.. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఎన్నో మోసాలు..