Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృతి

హైదరాబాద్ మహానగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారని పోలీసులు తెలిపారు.

Road Accident: దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృతి
Road Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 10, 2021 | 8:04 PM

Dhulapalli Road Accident: హైదరాబాద్ మహానగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారని పోలీసులు తెలిపారు. మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబంతో పాటు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. బాధితులు ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Read Also…  High Court: మరోసారి తెరపైకి మరియమ్మ లాకప్ డెత్ కేసు.. సీబీఐ దర్యాప్తు అవసరమన్న హైకోర్టు ధర్మాసనం!