భార్య గొంతు కోసి హతమార్చిన భర్త

తాళికట్టిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అతికిరాతకంగా భార్యను గొంతుకోసి హతమార్చాడు. జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే కుటుంబ కలహాల కారణంగా భార్యను అంతమొందించాడు. ఈ విషాద ఘటన..

భార్య గొంతు కోసి హతమార్చిన భర్త
Follow us

|

Updated on: Jun 17, 2020 | 11:54 AM

తాళికట్టిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అతికిరాతకంగా భార్యను గొంతుకోసి హతమార్చాడు. జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే కుటుంబ కలహాల కారణంగా భార్యను అంతమొందించాడు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలం కాసింపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు…

కాసింపూర్ గ్రామానికి చెందిన శంకర్, పుణ్యవతి దంపతులు గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాల కారణంగా దూరంగా ఉంటున్నారు. గత ఎనిమిది నెలలుగా భార్య పుణ్యవతి పుట్టింట్లోనే ఉంటోంది. అయితే, పెద్దలు రాజీ కుదర్చడంతో ఐదు రోజులక్రితమే ఆమె తన భర్త వద్దకు వచ్చింది. అయితే, పొలం పనులకు వెళ్లి చీకటి పడ్డాక ఇంటికి తిరిగి వస్తుండగా, భార్యాభర్తల మధ్య గొడవ మొదలైందని, మాట మాట పెరగటంతో కోపోద్రిక్తుడై శంకర్ చేతిలో ఉన్న కత్తితో భార్య గొంతుకోసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని జహీరాబాద్ సి ఐ సైదేశ్వర్, చిరాగ్పల్లి ఎస్ఐ గణేష్ సందర్శించి మృతదేహాన్ని జహీరాబాద్ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడ్డ మృతురాలి భర్త శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Latest Articles
నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు..
నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు..
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించిన వైఎస్ భారతి
ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించిన వైఎస్ భారతి
వామ్మో.. ఈ సన్నజాజి తీగల మారిన వయ్యారిని గుర్తుపట్టారా.. ?
వామ్మో.. ఈ సన్నజాజి తీగల మారిన వయ్యారిని గుర్తుపట్టారా.. ?
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
హైదరాబాద్ నుంచి శ్రీలంకకు IRCTC తక్కువ ధరకే అందిస్తోన్న ప్యాకేజ్
హైదరాబాద్ నుంచి శ్రీలంకకు IRCTC తక్కువ ధరకే అందిస్తోన్న ప్యాకేజ్
ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా కోల్‌కత్తా.. చేయందించిన ముంబై
ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా కోల్‌కత్తా.. చేయందించిన ముంబై
ఎన్నికల మధ్య దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎన్నికల మధ్య దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు,అరుపులు
బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు,అరుపులు