Crime News: ఆ విషయం చెప్పలేదని పెళ్లైన వారానికే పుట్టింటికి వెళ్లిన భార్య.. అవమానంతో భర్త..

Hanamkonda district: క్షణికావేశంలో కొంతమంది దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్నపాటి గొడవలకే ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాలకు తీరని శోకం మిగుల్చుతున్నారు.

Crime News: ఆ విషయం చెప్పలేదని పెళ్లైన వారానికే పుట్టింటికి వెళ్లిన భార్య.. అవమానంతో భర్త..
Crime
Follow us

|

Updated on: Mar 01, 2022 | 9:37 AM

Hanamkonda district: క్షణికావేశంలో కొంతమంది దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్నపాటి గొడవలకే ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాలకు తీరని శోకం మిగుల్చుతున్నారు. తాజాగా జాతీయ రహదారి కోసం జరిపిన భూసేకరణ విషయం నవ దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. ఎకరం భూమి పోయిందన్న విషయంపై దంపతులిద్దరూ గొడవపడ్డారు. కోపంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన భర్త బలవన్మరణానికి (Suicide) పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన హన్మకొండ జిల్లాలోని దామెర (damera) మండలం పసరగొండ గ్రామంలో చోటుచేసుకుంది. దామెర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పసరగొండ గ్రామానికి చెందిన నల్లెల గౌరయ్య (35) అనే యువకుడికి వారం కిందట భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ యువతితో పెళ్లయింది. అయితే.. గౌరయ్యకు గ్రామంలో మూడెకరాల భూమి ఉంది.

అయితే.. నాగ్‌పూర్‌ – విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కోసం జరిపిన భూసేకరణలో మూడెకరాల్లో ఎకరం భూమి పోయింది. ఈ విషయం పెళ్లికి ముందు చెప్పలేదని మనస్తాపం చెందిన గౌరయ్య భార్య.. భర్తను నిలదీసింది. అనంతరం మూడురోజుల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. వివాహం జరిగి వారం కాకముందే ఇలా జరగటంతో మనస్తాపం చెందిన గౌరయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం పొలంలో చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

AP News: ఎంతపనిచేశావమ్మ..? ఇద్దరు కుమార్తెలను చంపి.. వివాహిత ఏం చేసిందంటే..

Shocking: న్యూడ్ కాల్ అనగానే సొల్లు కార్చాడు.. ఆ మాయలేడి ఇచ్చిన ట్విస్ట్‌కు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది..!

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?