AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలేజీ ఫీజు చెల్లించలేక తనువు చాలించింది.. ఉరేసుకొని బీసీఏ విద్యార్థిని బలవన్మరణం..

కరోనా వైరస్ సంక్షోభం వల్ల చాలా మంది ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కుమార్తె కాలేజీ ఫీజు రూ.40 వేలు కట్టే పరిస్థితిలో కూడా ఆ కుటుంబం లేదు.

కాలేజీ ఫీజు చెల్లించలేక తనువు చాలించింది.. ఉరేసుకొని బీసీఏ విద్యార్థిని బలవన్మరణం..
Rajitha Chanti
|

Updated on: Dec 08, 2020 | 6:50 AM

Share

కరోనా వైరస్ సంక్షోభం వల్ల చాలా మంది ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కుమార్తె కాలేజీ ఫీజు రూ.40 వేలు కట్టే పరిస్థితిలో కూడా ఆ కుటుంబం లేదు. దీంతో తన ఫీజు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టం చూసి తనువు చాలించింది ఓ యువతి. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం బెలగావి జిల్లా బిడీ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షకీల్ సంగోలి కుమార్తె మెహెక్ (20) ఓ ప్రైవేట్ కాలేజీలో బీసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. లాక్‏డౌన్ కారణంగా కాలేజీ యాజమాన్యం ఇటీవల మెహెక్‏ను ఆదేశించింది. షకీల్ డబ్బు తీసుకురాలేకపోయాడు. తన కాలేజీ ఫీజు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను చూసి మనస్థాపంతో ఆ యువతి ఇంట్లోనే ఉరి వేసుకుంది. మెహెక్‏ను 4, 6 తరగతి చదువుతున్న ఇద్దరు సోదరులు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థిని ఐశ్వర్యారెడ్డి (19) ఫీజు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Follow Us