AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం: మొబైల్ పేలి విద్యార్థిని మృతి.. అసలు కారణం ఇదే..!

కజకిస్థాన్‌లో ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్ పేలి.. ఓ విద్యార్థిని చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. మొబైల్‌కి ఛార్జింగ్ అవుతున్నప్పుడు మాట్లాడం, పాటలు వినడం వంటివి చేయకూడదని తెలుసు. కాని కొందరు ఆ పని డేంజర్ అని కూడా అలానే చేస్తుంటారు. ఇక చిన్నపిల్లలు అయితే ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్‌లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు మొబైల్ పేలిన ఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. అయినా కొందరు మాత్రం ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్‌ని యూస్ […]

విషాదం: మొబైల్ పేలి విద్యార్థిని మృతి.. అసలు కారణం ఇదే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 01, 2019 | 5:36 PM

Share

కజకిస్థాన్‌లో ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్ పేలి.. ఓ విద్యార్థిని చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. మొబైల్‌కి ఛార్జింగ్ అవుతున్నప్పుడు మాట్లాడం, పాటలు వినడం వంటివి చేయకూడదని తెలుసు. కాని కొందరు ఆ పని డేంజర్ అని కూడా అలానే చేస్తుంటారు. ఇక చిన్నపిల్లలు అయితే ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్‌లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు మొబైల్ పేలిన ఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. అయినా కొందరు మాత్రం ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్‌ని యూస్ చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.

బాట్సోబాన్‌లోని 14 ఏళ్ల అలువా అస్సెట్‌కిజి అబ్జాల్చెక్ అనే అమ్మాయి మొబైల్‌లో పాటలు వింటోంది. అయితే.. మొబైల్‌లో ఛార్జింగ్ తక్కువగా ఉండటంతో కొద్ది సేపు ఛార్జింగ్ పెట్టింది. కాని పాటలు వినడం మాత్రం ఆపలేదు. కాసేపటికి మొబైల్ పేలి తలకి గట్టి దెబ్బ తగిలింది. ఫలితంగా దీని ఎఫెక్ట్ మెదడు పై పడింది. ఈ ఘటన తర్వాత కొద్ది సేపటికే ఆమె చనిపోయింది. ఛార్జింగ్ పెట్టి ఉన్నప్పుడు పాటలు వినడం వల్లనే ఇలా జరిగిందని నిపుణులు చెబుతున్నారు. అలువా మృతి ఆమె కుటుంబసభ్యుల్లోనూ, స్నేహితుల్లోనూ విషాదాన్ని నింపింది.

తమ స్నేహితురాలు చనిపోవడంతో.. నిద్రపోతున్నప్పుడు మొబైల్‌కి ఛార్జింగ్ పెట్టి, దాన్ని పక్కనే పెట్టుకుని పడుకోవద్దని చెబుతూ ఆలువా స్నేహితురాలు దోలాషేవా.. ఈ విషాద వార్తను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. గంటల తరబడి మొబైల్‌కి ఛార్జింగ్ పెట్టి ఉంచినా పేలుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇటీవలే బెంగళూరులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గతేడాది మలేసియా క్రాడిల్ ఫండ్ మినిస్ట్రీ CEO… నర్జిన్ హస్సాన్ మరణం కలకలం రేపింది. నర్జిన్ కూడా బెడ్‌రూంలో ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి నిద్రపోయారు. అది పేలడంతోనే ఆయన చనిపోయారు. మొబైల్‌కి 100 శాతం ఛార్జింగ్ పెట్టడం కూడా.. అది పేలడానికి ఒక కారణం అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం