Lightning Strike: పిడుగుపాటుకు ఐదుగురు బలి.. మృతుల్లో నలుగురు చిన్నారులు..

Lightning Strike in Bihar: పిడుగుపాటుకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన బీహార్‌లోని సహర్సా జిల్లా సిమ్రీ బక్తియార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో

Lightning Strike: పిడుగుపాటుకు ఐదుగురు బలి.. మృతుల్లో నలుగురు చిన్నారులు..
Lightning Strikes
Follow us

|

Updated on: Jun 29, 2021 | 8:14 AM

Lightning Strike in Bihar: పిడుగుపాటుకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన బీహార్‌లోని సహర్సా జిల్లా సిమ్రీ బక్తియార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం వర్షం కురిసే సమయంలో కొంత మంది పిల్లలు చంకా గ్రామంలోని పండ్ల తోటలో ఉన్నారు. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో వారంతా ఓ చెట్టు కింద ఆశ్రయం పొందారు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో పిడుగుపడడంతో నలుగురు పిల్లలతో సహా ఓ మహిళ అక్కడికక్కడే కుప్పకూలి మరణించారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనలో మృతి చెందిన వారిని మనీషా కుమారి, సంజన కుమారి, కైలాష్ కుమార్, 75 ఏళ్ల మహిళ భదయ్య దేవిగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో ఇద్దరు పిల్లల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం.. రూ.4లక్షల పరిహారం అందజేయనున్నట్లు సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ (ఎస్‌డీఓ) వీరేంద్రకుమార్‌ పేర్కొన్నారు.

సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయని.. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Also Read;

Cyber Crime: హైదరాబాద్‌లో మరో సైబర్ మోసం.. KYC అప్‌డేట్ పేరుతో 9 లక్షల మాయం..

Bank Holidays in July 2021: జూలై నెలలో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయంటే..