Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ecuador Prison Riots: ఈక్వెడార్ జైలులో మళ్లీ చెలరేగిన హింస.. 68 మంది మృతి..

ఈక్వెడార్‌లోని అతిపెద్ద జైలు అయిన లిటోరల్ పెనిటెన్షియరీలో శనివారం రాత్రి జరిగిన ఘర్షణల్లో 68 మంది ఖైదీలు మరణించారు. ఈ ఘటనలో 25 మంది ఖైదీలు గాయపడ్డారు...

Ecuador Prison Riots: ఈక్వెడార్ జైలులో మళ్లీ చెలరేగిన హింస.. 68 మంది మృతి..
Ecuador Prison Riots
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 14, 2021 | 9:19 AM

ఈక్వెడార్‌లోని అతిపెద్ద జైలు అయిన లిటోరల్ పెనిటెన్షియరీలో శనివారం రాత్రి జరిగిన ఘర్షణల్లో 68 మంది ఖైదీలు మరణించారు. ఈ ఘటనలో 25 మంది ఖైదీలు గాయపడ్డారు. తీర ప్రాంత నగరమైన గుయాక్విల్‌లోని జైలులో అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్స్‌తో సంబంధం ఉన్న జైలు ముఠాల మధ్య ఈ భీకర హింస చోటుచేసుకుందని పోలీసు నివేదిక తెలిపింది. ఖైదీల నుంచి తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ హింస ఎనిమిది గంటల పాటు కొనసాగింది.

ఈ సమయంలో ఖైదీలు ప్రత్యర్థి ఖైదీలను చంపడానికి జైలులోని మరొక భాగానికి వెళ్లడానికి డైనమైట్‌తో గోడను పేల్చివేయడానికి ప్రయత్నించారు. శత్రు ఖైదీలను చంపేందుకు ఖైదీలు తమ పరుపులను తగలబెట్టారని, తద్వారా వారు పొగలో చనిపోతారని గుయాస్ ప్రావిన్స్ గవర్నర్ పాబ్లో అరోసెమెనా చెప్పారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పారు. జైల్లో ఖైదీల హింస గురించి మాకు తెలుసునని రాష్ట్రపతి ప్రతినిధి చెప్పారు. 700 మంది పోలీసులు జైలులో పరిస్థితిని అదుపు చేస్తున్నారు.

రెండు నెలల క్రితం ముఠాల మధ్య జరిగిన పోరులో 119 మంది ఖైదీలు మరణించారు. మళ్లీ ఇదే జైలులో ఈ హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. లిటోరల్ పెనిటెన్షియరీ జైలులో 8000 మంది ఖైదీలు ఉన్నారు. హింసాత్మక సమయంలో జైలుపై డ్రోన్‌లు ఎగురవేయడం వల్ల జైలులోని మూడు భాగాలలో ఖైదీల వద్ద తుపాకులు, పేలుడు పదార్థాలు ఉన్నాయని గుర్తించామని పోలీసు కమాండర్ జనరల్ తాన్యా వరేలా చెప్పారు. ఖైదీలకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసే వాహనాల గుర్తించామని తెలిపారు.

అక్టోబర్‌లో, అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఎమర్జెన్సీ సమయంలో, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఇతర నేరాలపై పోరాడేందుకు భద్రతా దళాలకు పూర్తి అధికారం ఇచ్చారు. శనివారం, రాష్ట్రపతి ట్వీట్ చేస్తూ, “మనం హామీ ఇవ్వవలసిన మొదటి హక్కు జీవించే హక్కు, స్వేచ్ఛ. కానీ భద్రతా దళాలు భద్రత కోసం పని చేయలేకపోతే అది సాధ్యం కాదు. అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ సైన్యాన్ని జైళ్లకు పంపేందుకు రాజ్యాంగ న్యాయస్థానం ఇటీవల నిరాకరించడాన్ని ఆయన ప్రస్తావించారు.

Read Also.. Sharia Law: కఠినమైన షరియా చట్టం అమలుకు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధం.. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన తాలిబన్ ప్రభుత్వం!