AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ : రేవంత్ రెడ్డిపై డ్రోన్ కేసు.. ఐదుగురి అరెస్ట్.!

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫామ్‌హౌస్‌పై డ్రోన్ ఎగిరిన సంఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ డ్రోన్ ఎగరవేసిన సంఘటనలో రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. కేటీఆర్ లీజ్‌ ఫామ్ హౌస్‌పై డ్రోన్ ఎగరవేసిన ఘటనలో.. మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. రేవంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, విజయసింహారెడ్డి, ప్రవీణ్‌పాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, ఓంప్రకాష్‌రెడ్డి, రాజేష్‌, శివలపై పోలీసులు కేసు నమోదు చేశారు. […]

బ్రేకింగ్ : రేవంత్ రెడ్డిపై డ్రోన్ కేసు.. ఐదుగురి అరెస్ట్.!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 04, 2020 | 9:25 PM

Share

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫామ్‌హౌస్‌పై డ్రోన్ ఎగిరిన సంఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ డ్రోన్ ఎగరవేసిన సంఘటనలో రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. కేటీఆర్ లీజ్‌ ఫామ్ హౌస్‌పై డ్రోన్ ఎగరవేసిన ఘటనలో.. మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. రేవంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, విజయసింహారెడ్డి, ప్రవీణ్‌పాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, ఓంప్రకాష్‌రెడ్డి, రాజేష్‌, శివలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 184, 187, 11ఏ, రెడ్‌ విత్‌ 5ఏతో పాటుగా.. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. కాగా.. ఇప్పటికే ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ కూడా చేశారు. రేవంత్‌రెడ్డి, కృష్ణారెడ్డిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. అయితే రేవంత్‌ రెడ్డి, కృష్ణారెడ్డి ఆదేశాల మేరకే ఈ డ్రోన్‌లను ఎగరవేసినట్లు పోలీసులు తేల్చారు. ప్రైవేట్ ప్రాపర్టీలో అక్రమంగా డ్రోన్ ఎగురవేసినందుకు పోలీసుల చర్యలు తీసుకుంటామని అన్నారు.