AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకినాడ AE కేసులో బిగ్ ట్విస్ట్‌.. 45 రోజుల క్రితమే భర్తకు విషం ఇచ్చి చంపాడంటూ సౌజన్య లేఖ

సాధిక్‌ ఖాన్‌ వేధింపులు తాళలేక నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 45 రోజుల క్రితం మృతి చెందిన నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డికి విషప్రయోగం జరిగిందంటూ భార్య సౌజన్య రాసిన లేఖ తాజాగా బయటపడింది. నూకరాజు మరణ వాంగ్మూలం, పదేళ్ల కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారం, సౌజన్య లేఖతో సాధిక్‌ ఖాన్‌పై ఆరోపణలు మరింత తీవ్రంగా మారాయి..

కాకినాడ AE కేసులో బిగ్ ట్విస్ట్‌.. 45 రోజుల క్రితమే భర్తకు విషం ఇచ్చి చంపాడంటూ సౌజన్య లేఖ
Kakinada Nookaraju Family Tragedy
Srilakshmi C
|

Updated on: Aug 19, 2026 | 6:54 AM

Share

కాకినాడ, ఆగస్ట్‌ 19: కాకినాడ రైఫిల్‌ షూటింగ్‌ శిక్షకుడు సాధిక్‌ ఖాన్‌ వేధింపులు తాళలేక పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 45 రోజుల క్రితం నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడని అందరూ భావించినప్పటికీ దీని వెనుక అసలు కారణం బట్టబయలైంది. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తన భర్త జగదీశ్వరరెడ్డికి నిందితుడు సాధిక్‌ విషం ఇచ్చి హత్య చేశాడని ఆరోపిస్తూ ఆయన భార్య సౌజన్య రాసిన లేఖ పోలీసులకు లభించింది. దీంతో జగదీశ్వరరెడ్డి మృతికి అసలు కారణమేంటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నూకరాజు రాసినట్లు చెబుతున్న మరణ వాంగ్మూలం, ప్రాణాలతో బయటపడిన పదేళ్ల కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారం, సౌజన్య లేఖ కీలక ఆధారాలుగా మారాయి. సౌజన్య లేఖతో పాటు ఇతర వివరాలు వెలుగులోకి రావడంతో రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీసులు కాకినాడ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సాధిక్‌ నివాసానికి వెళ్లగా అప్పటికే అతను అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు. దీంతో నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

ప్రశాంతమైన కుటుంబంలో సాధిక్‌ ఖాన్‌ కల్లోలం

ఏఈ నూకరాజు అందరితో సౌమ్యంగా ఉండే వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారు. భార్య మీనా, కుమారుడు, కుమార్తె సౌజన్య, అల్లుడు, మనుమడు కార్తికేయరెడ్డితో ఆయన కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగేది. అయితే వీరి జీవితాల్లో సాధిక్‌ కల్లోలం సృష్టించడంతో వరుస విషాదాలు ఆ కుటుంబాన్ని కకావికలం చేశాయి. గతంలో నూకరాజు కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఏడాది జులై 2న అల్లుడు జగదీశ్వరరెడ్డి మృతి కూడా చెందారు. సాధిక్‌ వేధింపుల కారణంగా ఇప్పుడు నూకరాజు కుటుంబం మొత్తం గోదావరిలోకి దూకింది. ఈ ఘటనలో పదేళ్ల కార్తికేయరెడ్డి ప్రాణాలతో బయటపడగా.. నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. నూకరాజు మృతదేహం మంగళవారం లభ్యమవగా.. భార్య మీనా, కుమార్తె సౌజన్య మృతదేహాల కోసం మంగళవారం విస్తృతంగా గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, మత్స్యకారులు, అగ్నిమాపక సిబ్బంది నదిలో గాలింపు చేపడుతున్నారు. మరోవైపు పోలీసులు డ్రోన్ల సాయంతోనూ నదీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.

Follow Us
కాకినాడ AE కేసులో ట్విస్ట్‌.. 'నా భర్తకు విషం ఇచ్చి వాడే చంపాడు'
కాకినాడ AE కేసులో ట్విస్ట్‌.. 'నా భర్తకు విషం ఇచ్చి వాడే చంపాడు'
సరికొత్త మహీంద్రా స్కార్పియో పికప్ ట్రక్‌ ధర, ఫీచర్లు ఇవే
సరికొత్త మహీంద్రా స్కార్పియో పికప్ ట్రక్‌ ధర, ఫీచర్లు ఇవే
94 ఫోర్లు, 6 సిక్సర్లతో 1107 పరుగులు.. క్రికెట్ హిస్టరీలోనే..
94 ఫోర్లు, 6 సిక్సర్లతో 1107 పరుగులు.. క్రికెట్ హిస్టరీలోనే..
డెబ్యూ మ్యాచ్‌లోనే చెత్త రికార్డు మూటగట్టుకున్న లంక బౌలర్
డెబ్యూ మ్యాచ్‌లోనే చెత్త రికార్డు మూటగట్టుకున్న లంక బౌలర్
మార్కెట్‌లో సంచలనానికి స్కోడా స్లావియా రెడీ.. పూర్తి వివరాలు
మార్కెట్‌లో సంచలనానికి స్కోడా స్లావియా రెడీ.. పూర్తి వివరాలు
కియారా కాదు.. రామ్ చరణ్-సుక్కూ మూవీలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్!
కియారా కాదు.. రామ్ చరణ్-సుక్కూ మూవీలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్!
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. మళ్లీ భారీగా పెరుగుతున్న రేట్లు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. మళ్లీ భారీగా పెరుగుతున్న రేట్లు
ఇండియన్‌ మార్కెట్‌లోకి విన్‌ఫాస్ట్‌ ఎలక్ట్రిక్​ ఎస్‌యూవీలు
ఇండియన్‌ మార్కెట్‌లోకి విన్‌ఫాస్ట్‌ ఎలక్ట్రిక్​ ఎస్‌యూవీలు
రోజుకు కేవలం రూ.195 పొదుపుతో చేతికి రూ.10 లక్షలు..
రోజుకు కేవలం రూ.195 పొదుపుతో చేతికి రూ.10 లక్షలు..
Zudio బట్టలను అంత తక్కువ ధరలకు ఎలా ఇస్తుంది? బిజినెస్‌ సీక్రెట్!
Zudio బట్టలను అంత తక్కువ ధరలకు ఎలా ఇస్తుంది? బిజినెస్‌ సీక్రెట్!