Dog dispute : కుక్క అరుపులు తెచ్చిన తంటా.. ఒక నిండు ప్రాణాన్ని చంపింది. !

కుక్క అరుపులు తెచ్చిన తంటా.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం చిన్న కోట్ల గ్రామంలో ఈ దారుణం జరిగింది...

Dog dispute : కుక్క అరుపులు తెచ్చిన తంటా.. ఒక నిండు ప్రాణాన్ని చంపింది. !
Dog
Follow us

|

Updated on: Jun 27, 2021 | 8:04 AM

Barking dog dispute : కుక్క అరుపులు తెచ్చిన తంటా.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం చిన్న కోట్ల గ్రామంలో ఈ దారుణం జరిగింది. కుక్క కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమవడం విశేషం. వివరాల్లోకి వెళితే, స్థానికంగా నివసించే బాల నరసింహులు అనే వ్యక్తి తన పై మరుగుతుందంటూ ఒక పెంపుడు కుక్కని కొట్టాడు. అయితే..

తమ కుక్కని ఎందుకు కొడతావంటూ.. ప్రతీకారంగా నరసింహులు పై కుక్క యజమాని దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో కుక్క యజమాని దాడి చేయడంతో తీవ్ర గాయాలైన నర్సింహులు చికిత్స పొందుతూ బెంగళూరులో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నరసింహులు మృతికి కారణమైన కుక్క యజమానిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

మరణించే ముందు నిజమే మాట్లాడతారు..మృతుడి వాంగ్మూలం ఆధారంగా నిందితులకు యావజ్జీవ శిక్ష వేసిన కోర్టు

2015. ఒక వ్యక్తి ఆత్మహత్యా ప్రయతనం చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. వెంటనే, స్పాట్ కు చేరుకున్న పోలీసులు కాలిన గాయాలతో ఉన్న తస్బీరున్నిసా ఖాన్ ను ఆసుపత్రిలో చేర్పించారు. తరువాత కేసు పై విచారణ మొదలు పెట్టారు. విచారణ సమయంలో బాధితుడు ఇక్బాల్ ఖాన్ సోదరి అన్వర్ ఖాన్ ను వివాహం చేసుకున్నట్టు తెలిసింది. ఈ దంపతులు ఇద్దరూ ఇక్బాల్ ఖాన్ దంపతులు కలిసి ఒకే ఇంటిలో వేర్వేరు భాగాల్లో నివసించేవారు. వారి మధ్య ఆస్తి వివాదాలున్నాయి. ఆ ఇంటిలో కొంత భాగానికి సంబంధించి ఈ రెండు కుటుంబాల మధ్య స్పర్ధలు రేగాయి.

ఇదిలా ఉండగా ఒకరోజు వీరి మధ్యలో ఆ ఆస్తి విషయంలో వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపధ్యంలో ఇక్బాల్ (50), అతని భార్య షాహిన్ (40) బాధితుడిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. బయటకు వచ్చి అతను ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నాడని ఇరుగు పొరుగు వారిని పిలిచారు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి కాలిన గాయాలతో ఉన్న బాదితుడ్ని ఆసుపత్రికి చేర్చారు. ఆసుపత్రిలో రెండు రోజుల తరువాత అతను మరణించాడు. మరణించే ముందు పోలీసులు అతని దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. ఆ వాంగ్మూలంలో మృతుడు తనను తన బావ ఇక్బాల్, అతని భార్య షాహిన్ కలిసి కిరసనాయిల్ పోసి చంపే ప్రయత్నం చేశాడని చెప్పాడు. దీంతో భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తరువాత కోర్టులో కేసు విచారణ సందర్భంగా మృతుడు తస్మీరున్నీసా ఖాన్ కిరోసిన్ తానే పోసుకుని నిప్పంటించు కున్నాడని ఇక్బాల్ దంపతులు చెప్పారు. ఈ కేసులో 13 మంది సాక్షులను కోర్టు విచారించింది. అన్ని అంశాలు పరిశీలించిన బొంబాయి సెషన్స్ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆ తీర్పులో మృతుడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావించడం లేదని పేర్కొంది కోర్టు. మృతుడి మరణ వాంగ్మూలాన్ని పరిశీలనలోకి తీసుకున్న కోర్టు మరణించే సమయంలో ఎవరూ అబద్ధం చెప్పరని అభిప్రాయపడింది. ఇక్బాల్ దంపతులే అతనిని హత్య చేశారని నిర్ధారించింది. దీంతో వీరికి ఆస్తి వివాదంపై నిప్పంటించినందుకు జీవిత ఖైదు విధించింది. “ఇంటిలో కొంత భాగానికి సంబంధించి కుటుంబం మధ్య ఉన్న వివాదం కారణంగా మరణించిన వ్యక్తి తన తప్పు లేకుండా ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి (ముగ్గురు) చిన్న పిల్లలు కూడా ఉన్నారు ”అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.