AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video : కాంచీపురంలో ఉత్తరాది వలస కార్మికులను విచక్షణారహితంగా చితకబాదిన యజమాని.. వైరల్‌గా మారిన వీడియో

DMDK leader indiscriminately crushes migrant workers : తమిళనాడు కాంచీపురంలో ఓ కర్కశ యజమాని వికృత చేష్టలు బట్టబయలయ్యాయి...

Viral video : కాంచీపురంలో ఉత్తరాది వలస కార్మికులను విచక్షణారహితంగా  చితకబాదిన యజమాని.. వైరల్‌గా మారిన వీడియో
Dmdk Leader Suresh Raj
Venkata Narayana
|

Updated on: May 20, 2021 | 3:38 PM

Share

DMDK leader indiscriminately crushes migrant workers : తమిళనాడు కాంచీపురంలో ఓ కర్కశ యజమాని వికృత చేష్టలు బట్టబయలయ్యాయి. సదరు యజమాని ఉత్తరాది వలస కార్మికులను విచక్షణారహితంగా చితకబాదుతుండగా తీసిన వీడియో ఇప్పుడు తమిళనాట వైరల్ అయింది. ఆ వీడియోలో కార్మికుల్ని చిత్రహింసలు పెడుతున్న యజమాని కాంచీపురంకి చెందిన సురేష్ రాజ్ అని గుర్తించారు. ఇతను డిఎండికె పార్టీ ముఖ్య నేత కావడం విశేషం. స్థానికంగా ఉన్న కంపెనీలకు 30 మంది ఉత్తరాది కార్మికులను కాంట్రాక్టు కింద పనులకు కేటాయించి సురేష్ రాజ్ తీసుకొచ్చినట్టు సమాచారం. అయితే, కరోనా సమయంలో ఉపాధి లేక తమ సొంత గ్రామాలకు వెళ్లిపోవాలని ఆ వలస కార్మికులు ప్రయత్నించడంతో యజమాని సురేష్ రాజ్ తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. తన అనుమతి లేనిదే ఎవరు వెళ్లకూడదని వారిని కర్రలతో చితకబాది వాటిని వీడియోలు తీశాడు. ఈ వీడియోలే ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు తమిళనాడు పోలీసులు. యజమాని.. వలస కార్మికుల్ని చావగొడుతోన్న దృశ్యాలు ఈ కింది వీడియోలో చూడొచ్చు.

Read also : Modi : గ్రామాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి.. యువత, పిల్లల్లో వైరస్ సోకకుండా చర్యలు తీసుకోండి.. వైరస్ మ్యూటేషన్‌పై డైనమిక్‌గా ముందుకెళ్లండి : ప్రధాని