Case On C Kalyan: మ‌రో వివాదంలో టాలీవుడ్‌ నిర్మాత సీ క‌ళ్యాణ్‌.. బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు న‌మోదు.

Case On C Kalyan: టాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖ నిర్మాత సీ క‌ళ్యాణ్ మ‌రో వివాదంలో నిలిచారు. నిత్యం వార్త‌ల్లో నిలిచే క‌ళ్యాణ్‌పై తాజాగా కేసు న‌మోదైంది. షేక్‌పేట భూవివాదంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న‌ల్‌లో క‌ళ్యాణ్‌తో పాటు మ‌రో...

Case On C Kalyan: మ‌రో వివాదంలో టాలీవుడ్‌ నిర్మాత సీ క‌ళ్యాణ్‌.. బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు న‌మోదు.
Case On C Kalyan
Follow us

|

Updated on: Jun 29, 2021 | 12:11 PM

Case On C Kalyan: టాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖ నిర్మాత సీ క‌ళ్యాణ్ మ‌రో వివాదంలో నిలిచారు. నిత్యం వార్త‌ల్లో నిలిచే క‌ళ్యాణ్‌పై తాజాగా కేసు న‌మోదైంది. షేక్‌పేట భూవివాదంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న‌ల్‌లో క‌ళ్యాణ్‌తో పాటు మ‌రో ముగ్గురిపై కేసు న‌మోదైంది. వివ‌రాల్లోకి వెళితే.. అమెరికాలో వైద్యుడిగా ప‌నిచేస్తున్న స్వ‌రూప్ అనే వ్య‌క్తి 1985లో షేక్‌పేటలో ఫిలింన‌గ‌ర్ హౌసింగ్ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశాడు. ఈ స్థ‌లాన్ని 2015లో నారాణ‌య‌మూర్తి అనే వ్య‌క్తికి లీజుకు ఇచ్చాడు. నారాయ‌ణ మూర్తి ఆస్థ‌లంలో అప్ప‌టి నుంచి ఓ ఆర్గానిక్ స్టోర్‌ని న‌డుపుతున్నాడు. ఇదిలా ఉంటే సోమ‌వారం సాయంత్రం ష‌రూఫ్‌, శ్రీకాంత్‌, తేజ‌స్వీ అనే ముగ్గురు వ్య‌క్తులు ఆర్గానిక్ స్టోర్‌కు వెళ్లి నిర్మాత సీ క‌ళ్యాణ్ పంపించాడ‌ని చెప్పి.. స్టోర్‌కు తాళం వేశారు. ఆర్గానిక్ స్టోర్ య‌జ‌మానికి వారిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క‌ళ్యాణ్‌తో పాటు ఆ ముగ్గురిపై కూడా కేసు న‌మోదు చేశారు. పోలీసులు ప్ర‌స్తుతం ఈ విష‌య‌మై విచార‌ణ చేప‌డుతున్నారు.

Also Read: Murder Mystery: ఓ శాడిస్ట్ భర్త క్రైమ్ కథా చిత్రం.. హంతకుడిని పట్టించింది ఓ చిన్న అనుమానం..

GHMC Budget: జూలై 1 నుంచి గ్రెటర్‌లో పెద్ద ఎత్తున పట్టణ ప్రగతి.. 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మేయర్

Viral Video: పాపం ఈ అక్క కష్టం ఎవరికీ రావొద్దు.. వీడియోను నవ్వకుండా చూడండి మీకోసమే.!