Fake passport scam:ఫేక్ పాస్పోర్ట్ వ్యవహారంలో కుదులుతున్న డొంక.. రీ వెరిఫై చేస్తున్న పోలీస్ అధికారులు
పాస్పోర్ట్ మాటెత్తితే చాలూ.. బోధన్ షేక్ అవుతోంది. కొత్తగా ఆ ఊరికి పాస్పోర్ట్ వచ్చినా.. వెరిఫికేషన్కి ఎవరైనా వెళ్లినా ఉలిక్కిపడుతోంది. ఫేక్ పాస్పోర్ట్ వ్యవహారంపై పోలీసుల విచారణ జరుగుతోంది. అరెస్ట్లూ జరుగుతున్నాయి.
Fake Passport Case: పాస్పోర్ట్ మాటెత్తితే చాలూ.. బోధన్ షేక్ అవుతోంది. కొత్తగా ఆ ఊరికి పాస్పోర్ట్ వచ్చినా.. వెరిఫికేషన్కి ఎవరైనా వెళ్లినా ఉలిక్కిపడుతోంది. ఫేక్ పాస్పోర్ట్ వ్యవహారంపై పోలీసుల విచారణ జరుగుతోంది. అరెస్ట్లూ జరుగుతున్నాయి. అయినా కేటుగాళ్లు బెదరడం లేదు. నకిలీ అడ్రస్లపై పాస్పోర్ట్లు వస్తూనే ఉన్నాయి. కేవలం నాలుగు అడ్రస్లపైనే మళ్లీ 70పాస్పోర్ట్లు వచ్చాయి. అలర్టయిన పోస్టల్ శాఖ ఆ పాస్పోర్ట్లన్నింటిని వెనక్కి పంపింది. రీసెంట్గా జారీ అయిన 500పాస్పోర్ట్లను రీ వెరిఫై చేస్తున్నారు అధికారులు.
ఫేక్ పాస్పోర్ట్ ఎపిసోడ్ నడిపించింది అనిల్, మల్లేష్లేనా..? ఇంకా వాళ్ల వెనుక ఎవరైనా ఉన్నారా..? లింకులన్నీ ఎక్కడెక్కడో తిరుగుతున్నా అవి మళ్లీ ఆ ఇద్దరి దగ్గరే వచ్చి ఆగిపోతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టులో నకిలీ పాస్పోర్ట్ తీగలాగితే నిజామాబాద్ జిల్లా బోధన్లో డొంక కదిలింది. బోధన్ కేంద్రంగా నకిలీ పాస్పోర్టులు, ఆధార్కార్డులు జారీ అయినట్లు గుర్తించారు అధికారులు. పాస్పోర్ట్ ఏజెంట్ పరిమల్బెన్ సూత్రధారిగా 72పైనే నకిలీ పాస్పోర్టులు జారీ అయినట్లు ఐడెంటిఫై చేశారు. ఈ పాస్పోర్టులు ఏ ఇంటి నంబర్లపై జారీ అయ్యాయి..? ఆధార్కార్డులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరాతీస్తే ..ఎస్బీ అధికారులు అనిల్, మల్లేష్ల ప్రమేయంతోనే నకిలీ పాస్పోర్టులు జారీ అయినట్లు తేలింది.
డబ్బాశతో ఎలాంటి విచారణ లేకుండా పాస్పోర్టులను జారీ చేసిన ఎస్బీ అధికారుల వ్యవహారంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వాళ్లిద్దరూ బోధన్లో నాలుగేళ్లకు పైగా పనిచేశారు. ఈ మధ్యకాలంలో ఎన్ని పాస్పోర్ట్లు జారీ చేశారు.. ఎవరెవరికి జారీ చేశారన్నది మిస్టరీగా మారింది. ఆ వివరాలపైనే ప్రత్యేక బృందాలు కూపీ లాగుతున్నాయి. దర్యాప్తులో కొత్త కోణాలు, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మల్లేష్, అనిల్లు దాదాపు 500లకు పైగానే పాస్పోర్ట్లు జారీ చేసినట్టు తేలింది.
ఈ స్కామ్లో ఏజెంట్ పరిమళ్ బెన్ పాత్ర కూడా ఉంది.తప్పుడు అడ్రస్లు ఇచ్చి నకిలీ పాస్పోర్ట్లు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో ఇంటి నెంబర్లను గుర్తించి విచారించగా ఆ ఇంటి యజమానులకు.. పాస్పోర్టులు పొందిన వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. కనీసం ఆ ఇళ్లల్లో పాస్పోర్టులు పొందిన వ్యక్తులు అద్దెకు కూడా లేరని గుర్తించారు. గతంలో జారీ అయిన 72 నకిలీ పాస్పోర్టులు ఏ అడ్రస్లపై ఉన్నాయో..ఇవి కూడా సేమ్ అడ్రస్లపైనే ఉండటంతో పోలీసులే షాకవుతున్నారు. దీంతో ఒకే ఇంటి నంబర్పైన ఇన్నేసి ఆధార్కార్డులు, పాస్పోర్టులు ఎలా జారీ చేశారన్నదే జవాబు లేని ప్రశ్నగా మారింది. అయితే ఇద్దరు అధికారులు జారీ చేసిన పాస్పోర్టులన్నింటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే.. వందలకొద్ది నకిలీలలు బయటపడడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు పాస్పోర్ట్లు ఎవరు తీసుకున్నారు. వాళ్లంతా ఉగ్రవాదులా..? స్లీపర్ సెల్సా..? లేదంటే అసాంఘీక శక్తులా అన్న అనుమానాలు దడ పుట్టిస్తున్నాయి. పాస్పోర్ట్ తీసుకున్న వారిలో చాలామంది ఇప్పటికే దేశం వదిలి వెళ్లిపోయారు. మిగతా వాళ్లు ఏ ప్రాంతంలో ఉన్నారు..? ఎక్కడ తలదాచుకున్నారో గుర్తించడం అంత ఈజీగా కనిపించడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో నిజాలు వెలికితీసేందుకు సైబరాబాద్ సీపీ ఇప్పటికే ప్రత్యేక బృందాలను అపాయింట్ చేశారు. అలాగే కేంద్రానికి కూడా లేఖ రాశారు. మరి ఫేక్ పాస్ పోర్ట్ స్కామ్లో ముందు ముందు ఎలాంటి ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయో చూడాలి.
Read more:
నడిగడ్డలో గర్జించిన మంత్రులు.. పీవీ కుమార్తెకు అలంపూర్ ప్రజలు అండగా నిలవాలని పిలుపు