AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం..పెళ్లి అయిన 2 నెలలకే నవ దంపతులు మ‌ృతి

ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన నూతన వదూవరులు దర్మరణం చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులు కేరళకు చెందిర టీ మాథ్యూస్, నిను సుసెన్ ఏల్దోగా తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఈ దంపతులు కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వారు బయటకు రావడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో అగ్నికి ఆహుతయ్యారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం శుక్రవారం వేకువజామున 6 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మాథ్యాస్ వయసు 30 కాగా, […]

విషాదం..పెళ్లి అయిన 2 నెలలకే నవ దంపతులు మ‌ృతి
Ram Naramaneni
|

Updated on: Dec 22, 2019 | 3:51 PM

Share

ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన నూతన వదూవరులు దర్మరణం చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులు కేరళకు చెందిర టీ మాథ్యూస్, నిను సుసెన్ ఏల్దోగా తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఈ దంపతులు కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వారు బయటకు రావడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో అగ్నికి ఆహుతయ్యారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం శుక్రవారం వేకువజామున 6 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మాథ్యాస్ వయసు 30 కాగా, ఏల్దో వయసు 28 ఏళ్లు.

ఈ ఏడాది అక్టోబర్ 28న వీరి పెళ్లి పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. ఆ తర్వాత నవంబర్ 20న వీరు ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. అక్కడ నిను ఓ ప్రెవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండగా, మాథ్యాస్ జాబ్ చేస్తున్నాడు. ఘటనపై ఆస్ట్రేలియా పోలీసులు..ఇరు కుటుంబాలకు సమాచారం అందించారు. కొత్త దంపతుల మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కనీసం ఆఖరి చూపుకు కూడా నోచుకోకపోవడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Follow Us