AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: ఐడీఏ బొల్లారంలో ఘోరం.. భార్యను, అత్తను పొడిచి చంపిన ఎలక్ట్రీషియన్ 

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో ఒక ఎలక్ట్రీషియన్ కాపురానికి రావడం లేదని తన  భార్యను కత్తిపోట్లకు గురిచేశాడు. తనను అడ్డుకుంటున్న అత్తను క్రూరంగా కత్తితో పొడిచి చంపాడు.

Crime News: ఐడీఏ బొల్లారంలో ఘోరం.. భార్యను, అత్తను పొడిచి చంపిన ఎలక్ట్రీషియన్ 
Crime News
KVD Varma
|

Updated on: Apr 12, 2021 | 12:45 PM

Share

Crime News: సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో ఒక ఎలక్ట్రీషియన్ కాపురానికి రావడం లేదని తన  భార్యను కత్తిపోట్లకు గురిచేశాడు. తనను అడ్డుకుంటున్న అత్తను క్రూరంగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

జిన్నారం మునిసిపల్ ఆఫీస్ లో అన్నారం గ్రామానికి చెందిన నూనె నర్సింహా ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. ఏడేళ్ల క్రితం ఐడీఏ బొల్లారంనకు చెందిన మృతురాలు స్వరూప(32) ను వివాహం చేసుకున్నాడు. పెళ్ళైన కొన్ని రోజుల తరువాత స్వరూప భర్తతో అత్తారింటి వద్ద ఉండలేనని చెప్పి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. నర్సింహ పలుమార్లు ఆమెను కాపురానికి రమ్మని బ్రతిమిలాడినా ఆమె ససేమిరా అంది. కొన్ని రోజులుగా తరచు ఆమెను కాపురానికి రమ్మని నర్సింహా బలవంతం చేస్తూ వస్తున్నాడు. ఆమె రావడానికి నిరాకరించడంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు.

ఇదే క్రమంలో ఆదివారం తెల్లవారుజామున నర్సింహా స్వరూప ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆమెతో తీవ్రంగా ఘర్షణ పడ్డాడు. ఆ గొడవ మరింత ముదిరిపోవడంతో ఆవేశంలో ఉన్న నర్సింహా వంటింట్లోని కత్తి తీసుకుని భార్య స్వరూపపై దాడికి దిగాడు. ఈ సమయంలో స్వరూప తల్లి ఎల్లమ్మ తన అల్లుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. దీంతో ఆమెను కూడా కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయాలైన ఇరువురూ అక్కడిక్కడే మృతి చెందారు. తరువాత అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ లో నిందితుడు లొంగిపోయినట్టు ఐడీఏ బొల్లారం ఇన్స్ పెక్టర్ జి. ప్రశాంత్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అయన చెప్పారు.