Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు సజీవదహనం..

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు సజీవదహనం..
Follow us
uppula Raju

|

Updated on: Jan 29, 2021 | 5:41 AM

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోకవరం నుంచి విశాఖ వెళ్తున్న కారు అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఆ ధాటికి స్తంభం కారుపై పడి మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.

మృతులను విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ బుక్కా వీధికి చెందిన హనుమంతరావు, దేవీపట్నం మండలం ఫజిల్లాబాద్‌కు చెందిన సతీశ్‌గా గుర్తించారు. కారుల్లో ఉన్న రమాదేవి, భాను, ఆదిత్యకుమార్‌ అనే ముగ్గురు బయటపడ్డారు. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది గాయపడిన వారిని జగ్గంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా సంఘటన వద్ద కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది.

Fake Certificate: విజయవాడలో రెచ్చిపోయిన ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా.. కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు..