AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి నాలుగేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసిన జిల్లా కోర్టు..

ఇద్దరు చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఎల్ బీ నగర్ కోర్టు. హైదరాబాద్‏లోని శంకర్‌పల్లి మండలానికి చెందిన 45 ఏళ్ల ఎస్ రాజు 2016లో

బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి నాలుగేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసిన జిల్లా కోర్టు..
Rajitha Chanti
|

Updated on: Feb 06, 2021 | 8:21 PM

Share

ఇద్దరు చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఎల్ బీ నగర్ కోర్టు. హైదరాబాద్‏లోని శంకర్‌పల్లి మండలానికి చెందిన 45 ఏళ్ల ఎస్ రాజు 2016లో ఇద్దరు మైనర్ బాలికలను లైంగిక వేధింపులకు గురిచేశాడు. గుడికి వెళ్లి వస్తున్న ఆ ఇద్దరిని మాయమాటలతో తన ఇంట్లోకి తీసుకెళ్లి.. లైంగిక దాడికి యత్నించాడు. బాధిత చిన్నారుల్లో ఒక అమ్మాయి జరిగిన సంఘటనతో తీవ్ర భయాందోలనకు గురైంది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లాకోర్టు రాజును దోషిగా తేల్చింది. దీంతో అతనికి నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది ఎల్‌బీనగర్ కోర్టు.

Also Read:

మన్‌ఖుర్ద్ ప్రాంతంలో అదుపులోకి రాని మంటలు.. 19 ఫైర్ఇంజన్లతో కష్టపడుతున్న అగ్నిమాపక సిబ్బంది.. వీడియో