AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్రమంగా నిల్వా ఉంచిన స్పిరిట్‌ స్వాధీనం

నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా నిల్వా ఉంచిన స్పిరిట్‌ను పంజాబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 27,600 లీటర్ల స్పిరిట్‌ను గుర్తించి సీజ్ చేశారు. స్థానికంగా కొన్ని ఫ్యాక్టరీల్లో.. రసాయనాలను..

అక్రమంగా నిల్వా ఉంచిన స్పిరిట్‌ స్వాధీనం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 10, 2020 | 4:34 AM

Share

నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా నిల్వా ఉంచిన స్పిరిట్‌ను పంజాబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 27,600 లీటర్ల స్పిరిట్‌ను గుర్తించి సీజ్ చేశారు. స్థానికంగా కొన్ని ఫ్యాక్టరీల్లో.. రసాయనాలను నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా నిల్వ ఉంచుతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదివారం నాడు పలుచోట్ల చేపట్టిన తనిఖీల్లో 200 లీటర్ల సామర్థ్యం ఉన్న 139 డ్రమ్ముల్లో నిల్వా ఉంచిన కెమికల్ స్పిరిట్‌ను సీజ్ చేశారు. సదరు ఫ్యాక్టరీలకు చెందిన చేసిన యజమానులను అరెస్ట్ చేశారు. కెమికల్స్‌ నిల్వా ఉంచినందుకు గాను వారిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

Read More :

కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

తమిళనాడులో 3 లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులు