Crime: దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై రూ.15 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
Woman Gang-raped: అపార్ట్మెంట్లో మహిళ ఒంటరిగా ఉన్నది గమనించారు.. అనంతరం కొందరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై దారుణానికి
Woman Gang-raped: అపార్ట్మెంట్లో మహిళ ఒంటరిగా ఉన్నది గమనించారు.. అనంతరం కొందరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె ఇంట్లో ఉన్న రూ.15 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో చోటుచేసుకుంది. నగరంలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్లోకి చొరబడిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.. 26 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి రూ.15లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయిందని.. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే.. ఈ ఘటనపై పలు కోణాల్లో విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎవరైనా తెలిసిన వారి పనై ఉంటుందా అనే కోణంలోనూ విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. సామూహిక అత్యాచారం అనంతరం రూ.15లక్షల నగదు ఎత్తుకెళ్లారన్నారు.
ఈ ఘటన అనంతరం బాధితురాలు గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ కేసును కోల్కతా పోలీస్ డిటెక్టివ్ డిపార్టుమెంట్ దర్యాప్తు చేస్తోంది. అత్యాచారానికి ముందు మహిళను కట్టేసి ఉంచినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ మహిళ ఫ్లాట్ నుంచి ఫోరెన్సిక్ బృందం శాంపిల్స్ను సేకరించింది. అలాగే ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: