కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతామని తాలుకా బ్యార్లహల్లి వద్ద  ఓ ప్రైవేట్ బస్సు, టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో మినీ బస్సులో ప్రయాణిస్తున్న 11మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డవారిలో కొంతమందిని చింతామని, కోలార్ ఆస్పత్రులకు తరలించారు. చిక్‌బళ్లపూర్ డీసీ అనిరుధ్ శ్రవణ్, ఎస్పీ సంతోష్ బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. చింతామణి నుంచి మురుగుమల్ల వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని […]

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 03, 2019 | 3:22 PM

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతామని తాలుకా బ్యార్లహల్లి వద్ద  ఓ ప్రైవేట్ బస్సు, టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో మినీ బస్సులో ప్రయాణిస్తున్న 11మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డవారిలో కొంతమందిని చింతామని, కోలార్ ఆస్పత్రులకు తరలించారు. చిక్‌బళ్లపూర్ డీసీ అనిరుధ్ శ్రవణ్, ఎస్పీ సంతోష్ బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. చింతామణి నుంచి మురుగుమల్ల వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం. ప్రైవేట్ బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.