ప్రపంచంపై కరోనా పంజా.. తీవ్ర ఆందోళనలో ప్రజలు..
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ టెర్రర్ సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి పలువురు ప్రముఖులు కన్నుమూసిన...

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ టెర్రర్ సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి పలువురు ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచవ్యాప్తంగా నిన్న కొత్తగా 1,92,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,25,653కి చేరింది. అలాగే నిన్న ఒక్క రోజే 3936 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,71,060కి పెరిగింది.
ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. దేశంలో నిన్న రికార్డు స్థాయిలో 57,414 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అగ్రరాజ్యంలో ఇప్పటివరకూ మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 34,13,060కి చేరుకుంది. ఇక నిన్న కొత్తగా 300 మంది కరోనా బాధితులు మరణించడంతో, మొత్తం మృతుల సంఖ్య 1,37,782కి చేరింది. కాగా అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. ఇక బ్రెజిల్, ఇటలీ, ఫ్రాన్స్, మెక్సికో, లండన్ వంటి పలు దేశాల్లో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి.
అలాగే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే కదా. దీంతో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా గడచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 228,637 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 551 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,553కి చేరుకుంది. ఇందులో 2,92,258 యాక్టివ్ కేసులు ఉండగా.. 22,674 మంది కరోనాతో మరణించారు. అటు 5,34,621 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Read More: