AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే.. రక్తదానం చేసిన నాగబాబు

ఇవాళ 'వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే' సందర్భంగా రక్తదానం చేశారు మెగాబ్రదర్ నాగబాబు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తదానం చేసారు నాగబాబు. కరోనా కల్లోల సమయంలో ర‌క్తం దొర‌క్క వ్యాధిగ్ర‌స్తులు ఇబ్బంది పాలు కాకూడ‌ద‌ని, దాత‌లు ముందుకు రావాల‌ని...

వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే.. రక్తదానం చేసిన నాగబాబు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 14, 2020 | 6:26 PM

Share

ఇవాళ ‘వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే’ సందర్భంగా రక్తదానం చేశారు మెగాబ్రదర్ నాగబాబు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తదానం చేసారు నాగబాబు. కరోనా కల్లోల సమయంలో ర‌క్తం దొర‌క్క వ్యాధిగ్ర‌స్తులు ఇబ్బంది పాలు కాకూడ‌ద‌ని, దాత‌లు ముందుకు రావాల‌ని మెగాస్టార్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ పిలుపు మేరకు ఈ రోజు నాగబాబు రక్త దానం చేశారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా ఉండేందుకు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 253 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు కరోనాతో ఎనిమిది మంది బాధితులు మృతి చెందారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,737కు చేరింది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 182 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 2.352 మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 2,203 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read More: 

బ్రేకింగ్: కరోనాతో ఎమ్మెల్యే గన్‌మెన్‌ మృతి

భారీగా కరోనా మరణాలు.. శవాలతో నిండిపోయిన అతిపెద్ద శ్మశాన వాటిక

దారుణం.. ఇంటర్ ఫెయిల్‌తో.. ముగ్గురు విద్యార్థినుల ఆత్మహత్య!

తెలంగాణ సచివాలయంలో మరో కరోనా కేసు.. ఉలిక్కిపడుతోన్న ఉద్యోగులు