దారుణం.. ఇంటర్ ఫెయిల్‌తో.. ముగ్గురు విద్యార్థినుల ఆత్మహత్య!

ఇంటర్‌ ఫెయిల్ అయ్యారన్న మనస్తాపంతో ఇద్దరు, సరిగా చదవడం లేదన్న కారణంగా తల్లిదండ్రులు మందలించారని మనస్థాపంతో మరో అగ్రికల్చరల్‌ బీఎస్సీ విద్యార్దిని సూసైడ్...

దారుణం.. ఇంటర్ ఫెయిల్‌తో.. ముగ్గురు విద్యార్థినుల ఆత్మహత్య!
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2020 | 1:54 PM

ప్రకాశం జిల్లాలో 24 గంటల వ్యవధిలోనే ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటర్‌ ఎగ్జామ్స్‌లో ఫెయిల్‌ అయినందుకు.. ఏకంగా ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ముగ్గురు విద్యార్థినులు కూడా ప్రకాశం జిల్లాకు చెందిన వారే కావడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ఇంటర్‌ ఫెయిల్ అయ్యారన్న మనస్తాపంతో ఇద్దరు, సరిగా చదవడం లేదన్న కారణంగా తల్లిదండ్రులు మందలించారని మనస్థాపంతో మరో అగ్రికల్చరల్‌ బీఎస్సీ విద్యార్దిని సూసైడ్ చేసుకుంది.

మద్దిపాడు మండలం మల్లవరంలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధిని బొడిపోగు కీర్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, నాగులుప్పలపాడు మండలం కె.తక్కెళ్ళపాడులో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధిని గోసాల లుధియా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పామూరు మండలం కొత్తపల్లి గ్రామంలో సరిగా చదవడం లేదంటూ తల్లిదండ్రులు మందలించారని మనస్థాపంతో అగ్రికల్చరల్‌ బీఎస్సీ విద్యార్దిని దేవి ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. కాగా విద్యార్థినుల ఆత్మహత్యలతో మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Read More: 

తెలంగాణ సచివాలయంలో మరో కరోనా కేసు.. ఉలిక్కిపడుతోన్న ఉద్యోగులు

తెరుచుకున్న శబరిమల ఆలయం.. కానీ భక్తులకు నో ఎంట్రీ..

హైపర్ ఆదికి అనసూయ బంపర్ ఆఫర్.. తనతో సమానంగా రెమ్యునరేషన్..

అసభ్యంగా ప్రవర్తించాడని.. కొడుకుపైనే కేసు పెట్టిన నటి