AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం కోసం మహిళలు సైతం క్యూలో…

క‌రోనా లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 45 రోజుల సుదీర్ఘ మందు బాబుల నిరీక్షణకు తెలంగాణ ప్రభుత్వం తెర దింపేసింది. మద్యం అందుబాటులోకి తెచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మద్యం ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

మద్యం కోసం మహిళలు సైతం క్యూలో…
Jyothi Gadda
|

Updated on: May 06, 2020 | 4:33 PM

Share
క‌రోనా లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 45 రోజుల సుదీర్ఘ మందు బాబుల నిరీక్షణకు తెలంగాణ ప్రభుత్వం తెర దింపేసింది. మద్యం అందుబాటులోకి తెచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మద్యం ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.  చాలా రోజుల తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. షాప్ లు తెరుచుకోవడానికి ముందే మద్యం దుకాణాల వద్ద మద్యం ప్రియులు  బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపులన్నీ కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ హెచ్చరికతో ముందుగానే మందుబాబులు భౌతిక దూరం పాటిస్తూ తమ వంతు వచ్చే వరకు వేచి చూస్తున్నారు.
ఇక హైద‌రాబాద్ స‌హా ప‌లుచోట్ల మ‌ద్యం కోసం మ‌గ‌వారితో స‌మానంగా మ‌హిళ‌లు కూడా క్యూ క‌ట్టారు.  క్యూ లైన్లలో లేడిస్ సైతం పెద్ద సంఖ్యలో నిలబడి ఉండటం కనిపించింది. ముఖ్యంగా షాద్ నగర్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలలో మహిళలు మద్యం దుకాణాల ముందు క్యూలో నిలబడి ఉండటం కనిపించింది. కాగా నలబై రోజుల తరువాత మద్యం దుకాణాలు తెరుచుకున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసిన పోలీసులు వైన్ షాప్ ల వద్ద సామాజిక దూరం పాటించే విధంగా గుర్తులువేశారు.