AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unwanted Record : టీ20 కెప్టెన్సీ అరంగేట్రంలోనే ఓటమి.. శ్రేయస్ అయ్యర్ కంటే ముందు ఆ నలుగురు ఎవరంటే?

Unwanted Record : ఐర్లాండ్‌ తో తొలి టీ20లో ఓడిన శ్రేయస్ అయ్యర్ అరంగేట్ర కెప్టెన్సీలో పరాజయం చవిచూసిన ఐదో భారత కెప్టెన్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్ సరసన చేరిన అయ్యర్‌పై అభిమానుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Unwanted Record : టీ20 కెప్టెన్సీ అరంగేట్రంలోనే ఓటమి.. శ్రేయస్ అయ్యర్ కంటే ముందు ఆ నలుగురు ఎవరంటే?
Shreyas Iyer
Rakesh
|

Updated on: Jun 27, 2026 | 8:25 AM

Share

Unwanted Record : ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అనూహ్య ఓటమితో సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కొత్తగా సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు ఈ మ్యాచ్ పెద్ద చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌కు ఐర్లాండ్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఐర్లాండ్ కెప్టెన్ లీటర్ టక్కర్ యాభై పరుగులు, గారెత్ డెలానీ 49 పరుగులతో రాణించడంతో ఆ జట్టు 182 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ 49 పరుగులతో మెరుపులు మెరిపించినప్పటికీ, మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారత్ 148 పరుగులకే ఆలౌట్ అయి 34 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.

శ్రేయస్ అయ్యర్ కంటే ముందు టీ20 కెప్టెన్సీ అరంగేట్రంలో ఓడిపోయిన చివరి భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు గిల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. హరారేలో జరిగిన ఆ మొదటి మ్యాచ్‌లోనే జింబాబ్వే నిర్దేశించిన 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక భారత జట్టు 102 పరుగులకే ఆలౌట్ అయి ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ గిల్ 31 పరుగులు చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా అదే తరహాలో ఐర్లాండ్ చేతిలో మొదటి మ్యాచ్‌లోనే ఓడిపోయి గిల్ సరసన నిలిచాడు.

భారత అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో 2006 నుంచి ఇప్పటివరకు మొత్తం 15 మంది ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించారు. వీరిలో కేవలం ఐదుగురు మాత్రమే తమ మొదటి మ్యాచ్‌లోనే ఓటమిని చవిచూశారు. టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కూడా తన టీ20 కెప్టెన్సీ డెబ్యూ మ్యాచ్‌లోనే ఓడిపోవడం గమనార్హం. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా తన మొదటి కెప్టెన్సీ మ్యాచ్‌లోనే ఓటమిని ఎదుర్కొన్నాడు. తాజాగా ఈ జాబితాలోకి శుభ్‌మన్ గిల్ మరియు శ్రేయస్ అయ్యర్ వచ్చి చేరారు.

భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక మంది కెప్టెన్లు తమ మొదటి టీ20 మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, అజింక్యా రహానే, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు తాము కెప్టెన్లుగా బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు విజయాలను అందించారు. కాగా, లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోని సారథ్యం వహించిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండా (నో రిజల్ట్) ముగిసింది.

ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్స్ అయిన భారత్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు సోషల్ మీడియాలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఎంపికే తప్పని కొందరు విమర్శిస్తుండగా, గంభీర్ కోచింగ్ లో జట్టు వ్యూహాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ సిరీస్‌లో చివరిదైన రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us