చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో దర్శనమిచ్చిన జగజ్జనని
ఏలూరు , జూలై 22 : ప్రసిద్ధ దివ్య క్షేత్రమైన పెనుగొండలోని వాసవీ శాంతిధాం భక్తి పారవశ్యంతో మురిసిపోతోంది. శ్రీ వారాహీ దేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆలయంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడో రోజైన మంగళవారం నాడు క్షేత్రంలో ప్రత్యేక పూజాధికాలు కన్నులపండువగా నిర్వహించారు. ఈ విశేష పర్వదినాన అమ్మవారిని పసుపు కొమ్ములతో శోభాయమానంగా అలంకరించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
