AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కంటే దారుణం.. డేంజర్‌లో దేశం…

కరోనా వైరస్ ప్రపంచదేశాల ఆర్ధిక వ్యవస్థలను పూర్తిగా దెబ్బ తీసింది. దీనితో లక్షల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. అలాగే మన దేశంలో కూడా సుమారు 10 నుంచి 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడం ఖాయమని ప్రముఖ ఆర్ధిక పరిశోధన సంస్థ సీఎంఐఈ అంచనా వేసింది. దేశంలో నిరుద్యోగిత రేటు 27.11 శాతానికి పెరిగిందని ఆ సంస్థ పేర్కొంది. మార్చిలో ఇది గణనీయంగా 8.7శాతం పెరిగినట్టు సీఎంఐఈ నివేదిక తెలిపింది. ఇక ఈ రిపోర్టు ఇప్పుడు […]

కరోనా కంటే దారుణం.. డేంజర్‌లో దేశం...
Ravi Kiran
|

Updated on: May 06, 2020 | 7:58 AM

Share

కరోనా వైరస్ ప్రపంచదేశాల ఆర్ధిక వ్యవస్థలను పూర్తిగా దెబ్బ తీసింది. దీనితో లక్షల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. అలాగే మన దేశంలో కూడా సుమారు 10 నుంచి 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడం ఖాయమని ప్రముఖ ఆర్ధిక పరిశోధన సంస్థ సీఎంఐఈ అంచనా వేసింది. దేశంలో నిరుద్యోగిత రేటు 27.11 శాతానికి పెరిగిందని ఆ సంస్థ పేర్కొంది. మార్చిలో ఇది గణనీయంగా 8.7శాతం పెరిగినట్టు సీఎంఐఈ నివేదిక తెలిపింది. ఇక ఈ రిపోర్టు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్‌ను విధించింది. దీని కారణంగా ఎంతోమంది సామాన్య ప్రజలు ఉపాధి కోల్పోయారు. కేంద్రం పలు సడలింపులు ఇచ్చినా కూడా రవాణా సేవలు, వ్యాపారాలు అధికంగా మూతపడటంతో దేశంలో ఉన్న నిరుద్యోగ సంక్షోభం మరింతగా విషమించిందని సీఎంఐఈ నివేదిక తెలిపింది. రెడ్ జోన్లు ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లోనే ఈ రేటు ఎక్కువగా ఉందని తేలింది.

ఇక లాక్ డౌన్ మొదలైన మార్చి 24- 31 మధ్య దేశంలో నిరుద్యోగిత రేటు ఏకంగా 23.8శాతానికి పెరిగిందని సీఎంఐఈ వివరించింది. ఇప్పటికే దాదాపుగా 5 కోట్ల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఉంటారని నివేదిక అంచనా వేస్తోంది. సుమారుగా 1.6 బిలియన్ల మంది కార్మికులు – అంటే ప్రపంచ శ్రామిక శక్తిలో దాదాపు సగం మంది – వారి జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) హెచ్చరించింది, అంతేకాకుండా 436 మిలియన్లకు పైగా సంస్థలు కూడా తీవ్రమైన నష్టాలను ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయని ఐఎల్ఓ పేర్కొంది. కాగా, దేశంలో ఉన్న ఆర్ధిక సంక్షోభం పేదలకు భారం కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడుతుంది.

Follow Us
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వందే భారత్ రైలు జన్మస్థలం ఎక్కడో తెలుసా? మేక్ ఇన్ ఇండియా అద్భుతం
వందే భారత్ రైలు జన్మస్థలం ఎక్కడో తెలుసా? మేక్ ఇన్ ఇండియా అద్భుతం
పంటి నొప్పి పీడిస్తోందా.. ఈ 4 చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ దరిచేరదు
పంటి నొప్పి పీడిస్తోందా.. ఈ 4 చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ దరిచేరదు
యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ
యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ
రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు.. 10 లక్షల మంది రైతులకు..
రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు.. 10 లక్షల మంది రైతులకు..
పంజాబ్ కింగ్స్ క్యాంప్‌లో పాంటింగ్ హంగామా.. ఆటగాళ్లకు వార్నింగ్
పంజాబ్ కింగ్స్ క్యాంప్‌లో పాంటింగ్ హంగామా.. ఆటగాళ్లకు వార్నింగ్
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. 'ధురంధర్ 2' పై రజనీకాంత్
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. 'ధురంధర్ 2' పై రజనీకాంత్
మృత్యువుతో దాగుడుమూతలు.. భారీ పాముతో ఎకసెక్కాలు.. కట్‌ చేస్తే..
మృత్యువుతో దాగుడుమూతలు.. భారీ పాముతో ఎకసెక్కాలు.. కట్‌ చేస్తే..
తలకాయ మాంసం మెత్తగా ఉడకాలంటే.. మధ్యలో ఇవి వేస్తే చాలు..
తలకాయ మాంసం మెత్తగా ఉడకాలంటే.. మధ్యలో ఇవి వేస్తే చాలు..