AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కంటే దారుణం.. డేంజర్‌లో దేశం…

కరోనా వైరస్ ప్రపంచదేశాల ఆర్ధిక వ్యవస్థలను పూర్తిగా దెబ్బ తీసింది. దీనితో లక్షల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. అలాగే మన దేశంలో కూడా సుమారు 10 నుంచి 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడం ఖాయమని ప్రముఖ ఆర్ధిక పరిశోధన సంస్థ సీఎంఐఈ అంచనా వేసింది. దేశంలో నిరుద్యోగిత రేటు 27.11 శాతానికి పెరిగిందని ఆ సంస్థ పేర్కొంది. మార్చిలో ఇది గణనీయంగా 8.7శాతం పెరిగినట్టు సీఎంఐఈ నివేదిక తెలిపింది. ఇక ఈ రిపోర్టు ఇప్పుడు […]

కరోనా కంటే దారుణం.. డేంజర్‌లో దేశం...
Ravi Kiran
|

Updated on: May 06, 2020 | 7:58 AM

Share

కరోనా వైరస్ ప్రపంచదేశాల ఆర్ధిక వ్యవస్థలను పూర్తిగా దెబ్బ తీసింది. దీనితో లక్షల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. అలాగే మన దేశంలో కూడా సుమారు 10 నుంచి 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడం ఖాయమని ప్రముఖ ఆర్ధిక పరిశోధన సంస్థ సీఎంఐఈ అంచనా వేసింది. దేశంలో నిరుద్యోగిత రేటు 27.11 శాతానికి పెరిగిందని ఆ సంస్థ పేర్కొంది. మార్చిలో ఇది గణనీయంగా 8.7శాతం పెరిగినట్టు సీఎంఐఈ నివేదిక తెలిపింది. ఇక ఈ రిపోర్టు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్‌ను విధించింది. దీని కారణంగా ఎంతోమంది సామాన్య ప్రజలు ఉపాధి కోల్పోయారు. కేంద్రం పలు సడలింపులు ఇచ్చినా కూడా రవాణా సేవలు, వ్యాపారాలు అధికంగా మూతపడటంతో దేశంలో ఉన్న నిరుద్యోగ సంక్షోభం మరింతగా విషమించిందని సీఎంఐఈ నివేదిక తెలిపింది. రెడ్ జోన్లు ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లోనే ఈ రేటు ఎక్కువగా ఉందని తేలింది.

ఇక లాక్ డౌన్ మొదలైన మార్చి 24- 31 మధ్య దేశంలో నిరుద్యోగిత రేటు ఏకంగా 23.8శాతానికి పెరిగిందని సీఎంఐఈ వివరించింది. ఇప్పటికే దాదాపుగా 5 కోట్ల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఉంటారని నివేదిక అంచనా వేస్తోంది. సుమారుగా 1.6 బిలియన్ల మంది కార్మికులు – అంటే ప్రపంచ శ్రామిక శక్తిలో దాదాపు సగం మంది – వారి జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) హెచ్చరించింది, అంతేకాకుండా 436 మిలియన్లకు పైగా సంస్థలు కూడా తీవ్రమైన నష్టాలను ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయని ఐఎల్ఓ పేర్కొంది. కాగా, దేశంలో ఉన్న ఆర్ధిక సంక్షోభం పేదలకు భారం కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడుతుంది.