AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై యుద్ధంః అన్నయ్యకు ప్రత్యేక కృతఙ్ఞతలు.. వారిపై పవన్ ప్రశంసలు..!

కరోనాపై అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటానికి ప్రముఖుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కరోనాపై యుద్ధానికి తమ వంతు కృషిగా విరాళాలను

కరోనాపై యుద్ధంః అన్నయ్యకు ప్రత్యేక కృతఙ్ఞతలు.. వారిపై పవన్ ప్రశంసలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 27, 2020 | 5:34 PM

Share

కరోనాపై అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటానికి ప్రముఖుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కరోనాపై యుద్ధానికి తమ వంతు కృషిగా విరాళాలను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ కూడా ఓ అడుగు ముందుకేసింది. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలకు తోచినంత విరాళాలను అందిస్తున్నారు. అలాగే లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధిని కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు కూడా చిరంజీవి సహా పలువురు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో వారందరికీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. పేరు పేరున అందరినీ ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ ట్వీట్‌ వేశారు.

అందులో చిరంజీవి, ప్రభాస్, మహేష్‌ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, నితిన్, సాయి ధరమ్ తేజ్‌, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, దిల్ రాజు, తమన్, ప్రకాష్‌ రాజ్, సతీష్ వేగేష్న, అల్లరి నరేష్‌, వివి వినాయక్, రాజశేఖర్, శివాజీరాజా పేర్లను ఆయన ప్రస్తావించారు. కాగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై గత కొన్ని రోజులుగా పలు దేశాలు యుద్ధాన్ని చేస్తోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: సెన్సేషనల్ దర్శకుడికి బాలయ్య నుంచి పిలుపు..?