తల్లిని పోషించలేక.. కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన కొడుకు

కన్న తల్లిని పోషించకోలేకపోయిన ఓ కొడుకు.. కిరోసిన్ పోసి తగులపెట్టాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. మంచం పట్టిన కన్నతల్లిని పోషించలేక.. తనయుడు కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన దారుణ..

తల్లిని పోషించలేక.. కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన కొడుకు
Follow us

| Edited By:

Updated on: May 27, 2020 | 6:29 PM

కన్న తల్లిని పోషించకోలేకపోయిన ఓ కొడుకు.. కిరోసిన్ పోసి తగులపెట్టాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. మంచం పట్టిన కన్నతల్లిని పోషించలేక.. తనయుడు కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన దారుణ సంఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ మండలం నర్సింగ్ బట్ల గ్రామానికి చెందిన తిరుమల శాంతమ్మ (55) కొడుకు తిరుమల లింగస్వామి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. తల్లి వృద్ధురాలు కావడంతో.. గ్రామంలోనే వదిలేసి వెళ్లాడు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో లింగస్వామి తన ఇంటికి వచ్చాడు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న శాంతమ్మ మంచం పట్టింది. ఈ క్రమంలో లింగస్వామి తన తల్లిని సాకలేకపోయాడు. మంగళవారం రాత్రి ఇంటిలో నిద్రిస్తున్న తల్లి శాంతమ్మపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. దీంతో శాంతమ్మ అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం పోలీసుల దాకా చేరడంతో.. కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు లింగస్వామిని అదుపులోకి తీసుకున్నారు.

Read More:

వరంగల్ మర్డర్ మిస్టరీలో బయటపడ్డ మరో కొత్త కోణం.. 10 కూడా కాదు..

మాజీ లవర్స్.. క్లోజ్ ఫ్రెండ్స్..? రానాకు త్రిష వార్నింగ్!

వాహనదారులకు మరో శుభవార్త.. ఇక వాట్సాప్‌ నుంచి రవాణా శాఖ సేవలు..

కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు