లాక్డౌన్ ఎఫెక్ట్: సీరియల్ షూటింగ్స్కి బ్రేక్
తమిళనాడులో టీవీ సీరియల్స్ షూటింగులకు ఇటీవలే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, బుల్లితెర కళాకారుల సంఘం నిర్వాహకురాలు ఖుష్బూ తదితరులు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి షూటింగులకు అనుమతిని సాధించారు. అయితే,...
తమిళనాడులో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులతో ముందు వరుసలో ఉన్న మహారాష్ట్రతో తమిళనాడు పోటీ పడుతోంది. ఇటువంటి తరుణంలో చెన్నై సహా నాలుగు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి సంపూర్ణ లాక్డౌన్ విధించనుండటంతో టీవీ సీరియల్స్ షూటింగ్ నిలిపివేస్తున్నట్లు పెస్పీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి (వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త) తెలిపారు.
తమిళనాడులో టీవీ సీరియల్స్ షూటింగులకు ఇటీవలే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, బుల్లితెర కళాకారుల సంఘం నిర్వాహకురాలు ఖుష్బూ తదితరులు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి షూటింగులకు అనుమతిని సాధించారు. ప్రభుత్వ అనుమతితో వారం రోజుల పాటు షూటింగులు జోరుగా సాగాయి. అయితే, కరోనా ఒక్కసారిగా విజృంభించడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో, చెన్నై సహా కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి మరోసారి సంపూర్ణ లాక్డౌన్ ను విధించారు. దీంతో అన్ని కార్యకలాపాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ నెలాఖరు వరకు ఈ జిల్లాల్లో పూర్తి లాక్డౌన్ ను ప్రకటించడంతో టీవీ సీరియల్స్ షూటింగులు మళ్లీ నిలిచిపోయాయి.