AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్బీఐకి సుప్రీంకోర్టు అక్షింతలు

రిజర్వు బ్యాంకు అఫిడవిట్ దాఖలు చేసేముందు మీడియా సంస్థలకు 'లీక్' చేయడం పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఒక వైపు "మారటోరియం" ప్రకటిస్తూ, మరో వైపు రుణ వాయిదాలపై వడ్డీ వసూలు చేయడం ప్రజలకు నష్టం కలిగించే అంశమని సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది.

ఆర్బీఐకి సుప్రీంకోర్టు అక్షింతలు
Sanjay Kasula
|

Updated on: Jun 04, 2020 | 4:02 PM

Share

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. ఈ సందర్భంగా ఉపాధి కోల్పియి.. లోన్లు, ఈఎంఐలు కట్టలేనివారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) “మారటోరియం”ను తీసుకొచ్చింది. మొదట, మార్చి 1 నుంచి మే 31 మధ్య వాయిదాలు చెల్లించాల్సిన రుణాలపై మొరటోరియం విధించింది. ఆ తర్వాత దీనిని ఆగస్టు చివరి వరకు పొడిగించింది. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం ఆర్బీఐ ఇచ్చిన మారటోరియంను పట్టించుకోకుండా… తీసుకున్న రుణాలపై వడ్డీ వసూలు చేస్తున్నాయి. దీనిపై బ్యాంకుల రుణాలపై వడ్డీ వసూలును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

ఈ పిటిషన్‌ను విచారించింది జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ కె కౌల్, జస్టిస్ షా నేతృత్వంలోని ధర్మాసనం. అయితే పొడిగించిన రుణ తాత్కాలిక నిషేధ సమయంలో వడ్డీని మాఫీ చేస్తే రుణదాతలు సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతారని సెంట్రల్ బ్యాంక్ అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ అంశంపై రిజర్వు బ్యాంకు అఫిడవిట్ దాఖలు చేసేముందు మీడియా సంస్థలకు ‘లీక్’ చేయడం పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఒక వైపు “మారటోరియం” ప్రకటిస్తూ, మరో వైపు రుణ వాయిదాలపై వడ్డీ వసూలు చేయడం ప్రజలకు నష్టం కలిగించే అంశమని సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితిని తాము అర్ధం చేసుకుంటాము కానీ.., దేశ ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ప్రజలు, దేశం క్లిష్ట పరిస్థితులలో ఉంటే బ్యాంకులకు లాభార్జన ధ్యేయంగా మారిందని పిటీషనర్ తరపు న్యాయవాది రాజీవ్ దత్తా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం పై కేంద్ర ఆర్ధిక శాఖ, రిజర్వు బ్యాంకు వివరణ కోరుతూ తదుపరి విచారణను జూన్ 12 కు వాయిదా వేసింది ధర్మాసనం.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం